మిచాంగ్ తుఫాన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నరసాపురం, మొగల్తూరు మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు చేరింది. సముద్రం కల్లోలంగా మారింది కెరటాలు ఎగిసిపడుతున్నాయి. వేట నిషేధించటంతో చేపల బోట్లు తీరానికి చేరుకున్నాయి.