Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home TelanganaKarimnagar సింగరేణి లో ప్రారంభమైన మైన్స్ రెస్క్యూ పోటీలు..

సింగరేణి లో ప్రారంభమైన మైన్స్ రెస్క్యూ పోటీలు..

by Rama
Shyam Mishra

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లైయిన్ కాలనీ లోని సింగరేణి మైన్స్ రెస్క్యూ ప్రదాన కార్యాలయంలో 52 వ ఆలిండియా మైన్స్ రెస్క్యూ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలను భారత బొగ్గుగనుల భద్రతా విభాగం అదికారి శ్యామ్ మిశ్రా ముఖ్య అతిధిగా హాజరై ప్రారంబించారు. పోటీలలో దేశంలోని కోల్ మైన్స్ కు చెందిన 16 జట్లు, మెటల్ మైన్స్ కు చెందిన 9 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా డిఎంఎస్ శ్యామ్ మిశ్ర మాట్లాడుతూ దేశంలోని అన్ని కోల్ మైన్స్, మెటల్ మైన్స్ కు చెందిన రెస్క్యూ బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో అప్రమత్తత కోసం ఏటా దేశంలోని ఒక సంస్థలో ఆలిండియా రెస్యూ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం హిందుస్థాన్ జింక్ సంస్థ నుంచి మహిళా జట్టు పాల్గొంటున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014179
Total views : 79518

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.