Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

by
mla jagadeesh reddy

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలో నే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కెసిఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చదు. నెరవేర్చినట్లు చరిత్రలో లేదన్నారు జగదీశ్ రెడ్డి. రోజులు కాదు కదా 900 రోజులు ఆగిన కాంగ్రెస్ హామీలు అమలు కావని, ప్రజల నుంచి ప్రశ్న రావాలని అప్పటివరకు ఓపికగా ఉండాలన్నారు. ఇవ్వడం చేతకాక దాని నుంచి తప్పించుకునేందుకు అప్పులు చేశారని అంటారని అసెంబ్లీలో నన్ను అడిగితే దానికి సమాధానం నేను చెప్పేవాన్ని అన్నారు. విద్యుత్ పై అసెంబ్లీలో చర్చ వాళ్ళు పెట్టడం కాదు నేనే పెట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నారు జగదీశ్ రెడ్డి. కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేశారని ఇప్పుడు పాత పద్ధతి లో వేస్తామని అంటున్నారని అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు. అవసరమైతే కొత్త రుణాలు తీసుకోమన్నారు అది కూడా అమలు కాలేదు అన్నారు జగదీశ్ రెడ్డి. ధాన్యంకు కింటాకు భోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారని ఇంతవరకు దాని వూసే లేదనీ విమర్శించారు జగదీశ్ రెడ్డి.

Advertisements

You may also like

Our Visitor

009383
Total views : 62173

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.