Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh నంద్యాల టీడీపీ టికెట్ ఎవరికీ….

నంద్యాల టీడీపీ టికెట్ ఎవరికీ….

by Prakash
NND Farooq,Bhuma Brahmananda Reddy

నవనందుల కోట నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా నంద్యాల నవాబుగా ముద్దుగా పిలుచుకునే ఎన్ఎండి ఫరూక్ కె టిడిపి అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించడంతో కనుచూపుమేరలో ఎన్నికలు ఉన్న సందర్భంలో నియోజకవర్గ నూతన ఇన్చార్జి నియామకంతో టికెట్ కూడా కచ్చితంగా ఖరారైనట్లేననీ ఆనందం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ వర్గాలు… అయితే మరి కొంత మంది మైనారిటీలో, ఫరూక్ వ్యతిరేక వర్గంలో మరో చర్చ మొదలైంది అని చెప్పొచ్చు. 2004 లో శిల్పా మోహన్ రెడ్డి తో, 2024 లో శిల్పా రవి తో ఓడిపోయి చరిత్ర సృష్టించనున్న మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ అంటూ మైనార్టీ వర్గాల్లో చర్చ.మేము తెలుగుదేశం అభిమానులము , మైనార్టీలమే కానీ మనసు చంపుకొని ఫరూక్ కు వేయము,ఇతర పార్టీకి ఓట్లు వేస్తామని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి వర్గంలో కలకలం తారాస్థాయికి చేరుకుంది ఇన్ని రోజులు పార్టీని అంటిపెట్టుకొని ఎన్నో రకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు టికెట్ లేదంటే బాబు నిన్ను నమ్ముకున్న నాకు షూరిటీ లేకుండా పోయిందని భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం వాపోతున్నారు… నంద్యాల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి రెబల్ అభ్యర్థిగానైన ఒంటరిగా బరిలోకి దిగుతానని బ్రహ్మానంద రెడ్డి వర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన వెలిబుచ్చారు భవిష్యత్తులో ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు ఈ శిబిరాలలో జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: