ప్రధాని మోదీ (Narendra Modi) యూపీలోని వారణాసి లోక్సభ ఎంపీ స్థానానికి ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు 13వ తేదీన భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. జిల్లా అధికారుల సమాచారం ప్రకారం ఈ రోడ్ షో ప్రారంభించడానికి ముందు ప్రధాని లంకలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఉన్న మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి నివాళ్లు అర్పిస్తారు. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కాశీ విశ్వనాథ్ కారిడార్ వరకు ఐదు కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. లక్షలాది మంది ఈ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. అస్సి, సోనార్పూర, జంగం బరి, గోడౌలియా, బన్స్పథక్ మీదుగా విశ్వనాథ్ కారిడార్కు చేరుకుంటుందని బీజేపీ నేత దీలిప్ పటేల్ వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్ షో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. వారణాసి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగులు ముగిసిన తర్వాత 21 డివిజన్లలోని పార్టీ కార్యకర్తలను ప్రధాని రోడ్ షోకు భారీ సంఖ్యలో జనాలను తీసుకువచ్చేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వారణాసి నుంచి మోదీ ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వరుసగా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…





Total views : 194740