ప్రధాని మోదీ (Narendra Modi) యూపీలోని వారణాసి లోక్సభ ఎంపీ స్థానానికి ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు 13వ తేదీన భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. జిల్లా అధికారుల సమాచారం ప్రకారం ఈ రోడ్ షో ప్రారంభించడానికి ముందు ప్రధాని లంకలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఉన్న మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి నివాళ్లు అర్పిస్తారు. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కాశీ విశ్వనాథ్ కారిడార్ వరకు ఐదు కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. లక్షలాది మంది ఈ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. అస్సి, సోనార్పూర, జంగం బరి, గోడౌలియా, బన్స్పథక్ మీదుగా విశ్వనాథ్ కారిడార్కు చేరుకుంటుందని బీజేపీ నేత దీలిప్ పటేల్ వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్ షో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. వారణాసి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగులు ముగిసిన తర్వాత 21 డివిజన్లలోని పార్టీ కార్యకర్తలను ప్రధాని రోడ్ షోకు భారీ సంఖ్యలో జనాలను తీసుకువచ్చేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వారణాసి నుంచి మోదీ ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వరుసగా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
- బీఆర్ఎస్పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…