Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home National ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది..

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది..

by Rama
Farmers in Delhi

రైతులు ఆందోళన (Farmers Darna):

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన (Farmers Darna) కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు అంటున్నారు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది. రైతుల డిమాండ్లు ప్రధానంగా కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పెన్షన్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంపు, 2020-21లో ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసుల్ని కొట్టివేయడం, లఖింపూరిఖేరి బాధ్యులను శిక్షించడం, రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, పరిహారం, నకిలీ విత్తనాలు, మందుల తయారీదారులపై కఠిన చర్యలు మిర్చి, పసుపు, సుగంధ పంటలకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, అటవీ భూముల రక్షణ రైతుల డిమాండ్‌లుగా ఉన్నాయి.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇవే అంశాలే అజెండాగా కేంద్రంతో రైతులు చర్చలు జరపనున్నారు. మరోవైపు సరిగ్గా ఎన్నికలకు ముందు రైతులు ఆందోళనకు దిగడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వమే నెరవేర్చాలన్నది అన్నదాతల వాదన. సంయుక్త కిసాన్ మోర్చా -రాజకీయేతర విభాగం ఆధ్వర్యంలో తాజా ఆందోళనలు జరుగుతున్నాయి. Read Also..

  • టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
    నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు. నోట్స్, టెస్ట్…
  • తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.
    తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతుల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు…
  • నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.
    నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025636
Total views : 147573

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.