Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home National లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లా విజయం

లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లా విజయం

by Satya
లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లా విజయం

18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లా విజయం సాధించారు . బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. ఓం బిర్లా 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే మరోసారి ఆయనను అభ్యర్థిగా నిలబెట్టింది. రాజస్థాన్‌లోని కోట బుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా వ్యవహరించలేదు. లోక్ సభ సంఖ్యా బలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది. ఓం బిర్లా1962 నవంబర్ 23న కోటాలో జన్మించారు. ఆయన విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1991లో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా 1997లో నియమితులయ్యారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓం బిర్లా.. తొలిసారిగా 2003లో కోటా సౌత్ స్థానం నుంచి గెలిచి రాజస్థాన్ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని కోటా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ప్రహ్లాద్ గుంజాల్‌పై 41 వేల ఆధిక్యంతో గెలుపొందారు. గడిచిన 20 ఏళ్లలో లోక్ సభకు మరోసారి ఎన్నికైన నేతగా బిర్లా నిలిచారు. ఓం బిర్లా 2014 నుంచి కోట లోక్ సభ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. 2019లో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.