మహర్షి మూవీలో కథానాయకుడిలా మెదక్ జిల్లా కలెక్టర్ పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. రైతే దేశానికి వెన్నుముక అని తెలిసిన కలెక్టర్ రాహుల్ రాజ్ రైతులతో మమేకమై పొలం పనులు చేశారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు ఆనుకుని ఔరంగాబాద్ గొల్ల నారాయణ రైతు పొలం ఉంది. వారాంతంలో తమ పిల్లలను తీసుకుని రైతులతో కలిసి రాహుల్ రాజ్ దంపతులు ఆ పొలంలో వరి నాట్లువేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు. జిల్లాలో సుమారు 70వేల రైతులు ఉన్నారు. అందులో నాలుగు వందల నలభైఏడుకోట్ల రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. రైతులకు ప్రతి దశలో అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి.. లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను కలెక్టర్ పరిశీలించారు. పంటకు సంబంధించిన అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.భూగర్భంలో లభించే విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోందా..? ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందా..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైట్ క్వార్జ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనుమతులు లేకుండానే తెల్లరాయిని…
- ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.లంచం ఇస్తేనే పని జరుగుతుందనే స్థాయి నుంచి… లంచాల కోసమే పథకాలను సృష్టించే స్థాయికి కొందరు అధికారులు దిగజారిపోయారు. తాజాగా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఉదంతం దీనికి నిలువెత్తు నిదర్శనం. ఏసీబీ చర్యను స్వాగతిస్తున్నప్పటికీ… సామాన్య ప్రజల నుంచి…
- ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి…
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు డిజిటల్ కేబినెట్ సమావేశాల సన్నాహకాల్లో…
- తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 149007