ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా, మా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) తెలిపారు. కానీ ఇప్పుడు నేను దీనిపై ఎందుకు మాట్లాడుతున్నానంటే… ఈ వీడియో అంశాన్ని పవన్ కల్యాణ్ పొన్నూరులో ప్రస్తావించారు. మా అల్లుడు గౌతమ్, నా కుమార్తె విడాకులు తీసుకుంటున్నారు. ఆ ప్రక్రియ నడుస్తోంది. గతంలో కూడా గౌతమ్… నేను పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను కలుస్తాను, నేను చంద్రబాబు(Chandrababu)ను కలుస్తాను అని మా అమ్మాయితో అనేవాడు. విడాకులు ఇవ్వడానికి నా కూతురుకేమీ అభ్యంతరం లేదు… అయితే ఆమెకు పిల్లలున్నారు… వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ విషయంలోనే కోర్టులో మేం న్యాయపోరాటం చేస్తున్నాం. ఇది మా కుటుంబ విషయం. బయటివారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కూతురుకు సంబంధించిన విషయం కాబట్టి బహిర్గతం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. నా అల్లుడి మాటల వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడు. పవన్ కల్యాణే అతడితో మాట్లాడించాడు, చంద్రబాబు అందుకు సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. నేను సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నన్ను ఓడించాలనుకుంటున్న పవన్ కల్యాణ్, నన్ను అసెంబ్లీకి రానివ్వకూడదనుకుంటున్న చంద్రబాబునాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం ఇదని అంబటి ఫైర్ అయ్యారు.
- విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
- కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.