వైసీపీ(YCP)ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కోససీమ జిల్లా మలికిపురం ఎన్నికల ప్రచారం(Election campaign) సభలో మాట్లాడుతూ.. రైతుల కష్టాలను నియోజకవర్గం ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకోదని మండిపడ్డారు. డ్రైవర్ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని ఆ విషయాన్ని జనం అంత సులువుగా మరిచిపోరని అన్నారు. ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇదేక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘ఆంధ్రా ప్రజలరా ఊపిరి తీసుకోండి. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని’ అని పవన్ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.