Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Latest News బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర…

బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర…

by Prakash
Prajahita Yatra
Prajahita Yatra :

రేపటి నుండి మూడు రోజులపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర చేపట్టనున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొమ్మ శ్రీరామ్ మాట్లాడారు. రేపు కోహెడ నుండి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతుందని, యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పగించకుండా ఆ నిధులను పారదర్శకంగా వినియోగించాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం ప్రారంభం కాకముందే ఇప్పడికే గిరిజన తండాలు, మారుమూల గ్రామాలలో మొదలైన త్రాగు నీటి ఎద్దడిని తొలగించడానికి కృషి చేయాలని కోరారు. రెండుసార్లు గాలిపాటున గెలిచిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ బిఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: