Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh నాణ్యమైన విద్య అనేది హక్కు…

నాణ్యమైన విద్య అనేది హక్కు…

by Prakash
Jagan

మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీపడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంమని, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అనేది పాత నినాదమన్నారు.. కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు.. ఇది ఇక కొత్త నినాదం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని చెప్పారు. ఈదేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ ప్రపంచంతో మనం పోటీపడుతున్నామన్నారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలన్నా,,,. మంచి మంచి జీతాలు సంపాదించాలన్నా నాణ్యమైన విద్యద్వారానే సాధ్యమవుతుందని సిఎం జగన్ అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019254
Total views : 90159

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.