Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana కేంద్ర ప్రభుత్వం పై రేవంత్‌రెడ్డి ఆరోపణ

కేంద్ర ప్రభుత్వం పై రేవంత్‌రెడ్డి ఆరోపణ

by Satya
Revanth Reddy

తెలంగాణ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్‌విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ వంటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని చెప్పారు. అయితే ఇంత వరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు అన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు. పెట్టుబడి రాక గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు పాలుపడుతన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరిని కూడా కేంద్రం కొనలేని స్థితిలో ఉందని విమర్శించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, వందలాది మంది రైతులు చనిపోయినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే దృష్టి సారించింది. దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022లోపు పక్కా ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. కానీ, ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. రాష్ట్రంలో కేసీఆర్‌ మాదిరిగానే కేంద్రంలో మోదీ భారీగా అప్పులు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు.

Advertisements

You may also like

Our Visitor

014416
Total views : 80137

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.