263
సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉన్నా కడపలోని స్టీల్ ప్లాంట్ ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న సొంత జిల్లానే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీకి బానిసలై వారికి మద్దతు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు వస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ కు ఓటేసినా బీజేపీ ఖాతాలోకి వెళ్లుందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారన్నారు. వైసీపీ కోసం నిస్వార్ధంగా పని చేస్తే ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారన్నారు. అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడుంది అని ప్రశ్నించారు






Total views : 90764