మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్ పెల్లి వద్ద గల అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు..త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకొని ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు..ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చెక్ పోస్టులు కీలకం అని సీఐ విద్యాసాగర్ పేర్కొన్నారు..సాయుధ బలగాలతో కూడిన పహారా పకడ్బందీగా చెక్ పోస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు..అక్రమ మార్గంలో మద్యం,డబ్బులు ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను రాకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు…అధికారులు సమన్వయంతో మెదిలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు…అనంతరం పోలీసులకు తగు సూచనలు,సలహాలు అందించారు.. ఆయన వెంట పోలీస్ సిబ్బంది వున్నారు..
అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు..
339
previous post




Total views : 78946