జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కావలిలో ఆయన మాట్లాడుతూ.. ఒక జాతీయ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది.. మరో జాతీయ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇలా రాష్ట్రానికి మోసం చేసిన పార్టీలన్నీ చంద్రబాబు పక్షమేనని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సినిమా విలన్ క్యారెక్టర్లన్నీ కలిపితే చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మూడు సార్లు రంగురంగుల మేనిఫెస్టో చూపించారు.. కనీసం ఒక్కసారైనా మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోరన్నారు. గత ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకును కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ప్రాతినిధ్యం వహిస్తున్న వి. వెంకటాయపాలెం సొసైటీని కూల్చేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదిపారు. పీఏసీఎస్ లో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది తిరుగుబాటు స్వరం వినిపించారు. ఈ మేరకు ఖమ్మం డీసీవో విజయకుమారిని కలిసిన 11 మంది సభ్యులు వి.వి.పాలెం సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం పెడుతున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో సమావేశం నిర్వహించి ఓటింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని విజయకుమారి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు షాబాద్ మండలంలోని పోలారం, గోపి గడ్డ మరియు సీతారాంపురం గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్. ఈ నేపథ్యంలో ఆయన సీతారాంపురం లో ఉన్న శ్రీ సీతారాముల స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…
సీతారాంపూర్ లో ఉన్న శ్రీ సీతారాముల స్వామి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎలాంటి పక్షపాతం చూపించకుండా, కుటుంబ పాలన చేయకుండా ప్రజలకే నా సేవ అంకితం చేస్తానని ఆయన సీతారాముల సాక్షిగా ప్రమాణం చేశాడు. ఈ నేపథ్యంలో కెసిఆర్ రైతుబంధు గురించి చెప్పిన మాటలకు ఆయన కౌంటర్ ఇస్తూ..
రైతుబంధు అనేది కాంగ్రెస్ పార్టీ ఆప్తే ఆగేది కాదని ఎలక్షన్ ఉన్నందున ఎలక్షన్ కమిషన్ ఆపేసిందని ఈ విషయం తెలియని కెసిఆర్ సోయండి మాట్లాడుతున్నాడా లేక తాగి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని లేక మందేసి మాట్లాడుతున్నాడో నాకు అర్ధం కావడం లేదనీ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రైతుబంధును అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సంద్భంగా ఆయన మీడియాతో తెలిపారు.
Read Also…
Read Also…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు, వారి అనుచరుల ఇళ్ళల్లో సోదాలు జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంజీవరెడ్డి నివాసానికి మల్లారెడ్డికి చెందిన డబ్బు భారీ మొత్తంలో చేరిందన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంజీవరెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని సోదాలు చేశారు. అయితే, సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకకపోవడం గమనార్హం. సోదాల సందర్భంగా సంజీవరెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
Read Also..
Read Also..
కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల రూ.200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను జరిపినట్లు గుర్తించామని తెలిపిన ఈడీ.యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా కొనుగోలు చేసినట్లు, విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని తెలిపిన ఈడీ.
మంథని మండల కేంద్రంలో బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగమే బి ఎస్ పి మ్యానిఫెస్టో అని అన్నారు. మంథని ప్రాంతంలో పాలించిన నాయకులు ఇక్కడి ఇసుకను, బొగ్గును, నిధులను ప్రాజెక్టుల పేరిట ఇక్కడి నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఈ ప్రాంత ప్రజలు ముంపుకు గురైనా నష్ట పరిహారం కూడా ఇప్పించలేదని ఆరోపించారు. లు ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రజలకు ఏలాంటి మేలు జరుగలేదని అన్నారు. అందుకే బహుజనుల కోసమే తాను ఎమ్మెల్యే బరిలో నిలిచానని, ఈ ఎన్నికలలో బహుజనులు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకమైనవని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఛత్తీస్ గఢ్ తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఆయన తెలిపారు. కేంద్రంలో పరిపాలించే దేశ నాయకుడ్ని ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రదాని మోడీ చెప్పడం హాస్యాస్పదమని వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ఫెయిల్ అయిందని దానికి ఉదాహరణ నేనేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు.
నిర్మల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కరెంట్ 3 గంటలు చాలని పీసీసీ చీఫ్ అంటున్నారని మండి పడ్డారు. ధరణి పోర్టల్ ఉండాలా? వద్దా? అన్నారు. రైతు బంధు పథకం ఓట్ల కోసం కాదన్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఏపార్టీ గెలిస్తే లాభమో ఆలోచించాలన్నారు. ప్రతీ పార్టీ చరిత్ర చూడాలన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు. అన్నీ ఆలోచించి ఓటేయ్యాలని ప్రజలకు సూచించారు. పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్ని.. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? అన్నారు. నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 70 నుంచి 80 వేలు దాటాలన్నారు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని ఫైర్ అయ్యారు. దళిత బంధు పుట్టించింది కేసీఆర్ అన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. రైతు బంధు కూడా అందించామన్నారు.
జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండడని, కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన ప్రజాసేవ అందరికీ తెలిసిందేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అలాంటి నేత వారసుడికి కాంగ్రెస్ పార్టీ నేడు తీవ్ర అన్యాయం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అన్నట్లు ఉండేదని చెప్పారు. సీఎల్పీ నేతగా పీజేఆర్ ఆ పార్టీకి ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు కొంతమంది ముఠాకోరుల చేతుల్లోకి వెళ్లిందని, పార్టీ కోసం కష్టపడుతున్న నేతలకు కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోందని హరీశ్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారని వివరించారు. వారిని బీఆర్ఎస్ పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించేందుకే నేడు విష్ణువర్ధన్ ఇంటికి వచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ లో చేరేందుకు విష్ణు అంగీకరించారని, త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని పేర్కొన్నారు. నాగం జనార్దన్, విష్ణులకు బీఆర్ఎస్ లో గౌరవాన్ని, సముచిత స్థానాన్ని కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన తర్వాత విష్ణు అధికార పార్టీలో చేరతారని సమాచారం.






Total views : 90713