భారత దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా 3000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదని, సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నట్లు శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కార్యకరమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో పాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోఇచ్చిన హామీలన్నింటిని వంద శాతం నెరవేర్చిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. గతంలో పెద్దాయన పరిపాలనాలో ప్రస్తుతం ఆయన ప్రతి పక్షంలో ఉన్నాడు. గత ప్రభుత్వ హయాంలో 70 సంవత్సరాలు వచ్చిన వారికి పెన్షన్ అందించే వారు. కొత్త పెన్షన్ ఎవరికైనా రావాలంటే ప్రస్తుతం ఉన్న పెన్షన్ దారుడు మరణిస్తే కానీ మంజూరు అయ్యే పరిస్థితులు ఉండేవి కాదన్నది మనందరికీ తెలిసిన విషయమేమన్నారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హతే ఆదరంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు పెన్షన్ అందించారన్నారు. రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ను తన తనయుడు ఈ రోజు 3000 లు చేసిన గొప్ప మనసున్న నాయకుడమ్మ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ అన్ని రాష్ట్రాలలో కంటే ఎపిలో భిన్నమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఐదు లక్షలు నున్న వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ని 25 లక్షలకు పెంచి పేదలకు అండగా నేనున్నానని సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. అనంతరం వారు లబ్దిదారులకు పెంచిన రూ 3000 పెన్షన్ లను అందజేశారు. మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు రెండు లక్షలు రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సలర్లు, వైకాప నాయకులు,మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున వారి సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలింటర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష
అద్భుతమైనటువంటి రాయచోటి ప్రజల చిరకాల కోరికనైటువంటి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తి కావడం జరిగింది. ఈ నెల 6 వ తేదిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభం జరగనున్నట్లు అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పెండింగ్ పనులను మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు, అన్నమయ్య జిల్లా వైసిపి మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, ఆసుపత్రి సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, మహేశ్వర రాజు, లక్ష్మి ప్రసాద్ ఇంజనీరింగ్ శాఖ డి ఈ ఈ రాజగోపాల్ రెడ్డి లతో కలిసి వారు పరిశిలించారు. ఈ సందర్బంగా 23 కోట్లతో పాటు 40 లక్షల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐ పి హెచ్ ల్యాబ్ ను 25 లక్షల నిధులతో పూర్తి కావచ్చని ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశిలించి మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేసి రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేందుకు కృషి చేయాలన్నారు. ఆసుపత్రి నేమ్ బోర్డు, గ్రీనరి కోసం ఏర్పాట్లు, రోడ్లను వారు పరిసిలించారు. ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పెసంట్లకు వసతులతో పాటు వైద్య సేవలు అందించి ఆయా వైద్యుల గదులను కుడా పరిశిలించి వైద్యులకు కేటాయించిన గదుల స్థితి గతులను వారిని అడిగి తెలుసుకొన్నారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, లిఫ్ట్, డయాలసిస్ తదితర వాటిని పరిశిలించి మిగిలిన పనులను కుడా త్వరితగతిన పూర్తీ చేసి 6వ తేదీ ప్రారంభం చేయడానికి సిద్దం చేయాలనీ గుత్తే దారులకు సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిధులుగా హాజరుకానున్న ఆంధ్రప్రదేశ్ సిఎం అదనపు కార్యదర్శి కె ధనంజయరెడ్డి ఐఎఎస్, ఎంపి మిథున్ రెడ్డి, శాసన మండలి డిప్యూటి చైర్మన్ జఖియా ఖానం హాజరు కానున్నట్లు వారు తెలిపారు. వారి వెంట కౌన్సలర్ అన్నా సలీం, ఎ 1 కాంటాక్టర్ రియాజ్ రెహ్మాన్, ఇతర వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






Total views : 75413