దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ లబ్ధిని అందించడంతో పాటు మొత్తం పెన్షన్ దారులు కూడా మన రాష్ట్రంలోనే అత్యధికమని వనిత అన్నారు. సోమవారం నాడు కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా మంజూరైన 220 మంది పెన్షన్ దారులకు 6 లక్షల 60 వేల రూపాయల పెన్షన్ ను హోంమంత్రి స్వహాస్తాలతో అందజేశారు. దీంతో కొవ్వూరు రూరల్ మండలంలో పెన్షన్లు 10266 నుండి 10,438కి పెరిగాయి. వైఎస్సార్ పెన్షన్ కానుక క్రింద పెన్షన్ల ఖర్చు మొత్తం మూడు కోట్ల మూడు లక్షల తొంబై తొమ్మిది వేల రూపాయలకు పెరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… కొవ్వూరు నియోజకవర్గంలో ఈ ఒక్క నెలలోనే 620 మందికి నూతన పెన్షన్లు అందజేశామన్నారు. చాగల్లు మండలంలో 126 మందికి, తాళ్లపూడి మండలంలో 189 మందికి, కోవ్వూరు టౌన్ లో 85 మందికి, కొవ్వూరు రూరల్ మండలంలో 220 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ జనవరి నెల నుండి కొవ్వూరు నియోజకవర్గంలో మొత్తం 32,298 మందికి 9 కోట్ల 48 లక్షల 32 వేల 500 రూపాయలను ప్రతి నెలా అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి పెన్షన్ ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుందన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి
భారత దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా 3000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదని, సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నట్లు శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కార్యకరమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో పాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోఇచ్చిన హామీలన్నింటిని వంద శాతం నెరవేర్చిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. గతంలో పెద్దాయన పరిపాలనాలో ప్రస్తుతం ఆయన ప్రతి పక్షంలో ఉన్నాడు. గత ప్రభుత్వ హయాంలో 70 సంవత్సరాలు వచ్చిన వారికి పెన్షన్ అందించే వారు. కొత్త పెన్షన్ ఎవరికైనా రావాలంటే ప్రస్తుతం ఉన్న పెన్షన్ దారుడు మరణిస్తే కానీ మంజూరు అయ్యే పరిస్థితులు ఉండేవి కాదన్నది మనందరికీ తెలిసిన విషయమేమన్నారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హతే ఆదరంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు పెన్షన్ అందించారన్నారు. రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ను తన తనయుడు ఈ రోజు 3000 లు చేసిన గొప్ప మనసున్న నాయకుడమ్మ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ అన్ని రాష్ట్రాలలో కంటే ఎపిలో భిన్నమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఐదు లక్షలు నున్న వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ని 25 లక్షలకు పెంచి పేదలకు అండగా నేనున్నానని సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. అనంతరం వారు లబ్దిదారులకు పెంచిన రూ 3000 పెన్షన్ లను అందజేశారు. మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు రెండు లక్షలు రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సలర్లు, వైకాప నాయకులు,మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున వారి సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలింటర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరులో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లను వారు తొలగించి విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.






Total views : 75443