విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది. జనతా బజార్ కారుల స్క్రాప్ దుకాణంల్లో మంటలు అంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటల ను అదుపులోకి ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి అధికారులు పీల్చుకున్నారు. షార్ట్ సార్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉంటాదాని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh News
మహిళ పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దబిడి దిబిడే అన్నారు మంత్రి రోజా. తాను చదివిన కాలేజీలోనే ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి ఆర్కేరోజా. కాలేజీలో చదివే రోజులను జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు. విద్యార్థినులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న రంగంలో రాణించి చరిత్ర సృష్టించాలని రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో వార్షిక పూర్వవిద్యార్థినుల సమ్మేళనం కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు టీచర్ చెప్పినట్టు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఎవరెన్ని అడ్డంకు సృష్టించిన , అవమానించిన
ధైర్యంగా లక్ష్యం వైపు వెళ్లాలని సూచించారు. అనుకున్న రంగంలో మనం విజయం సాధిస్తేనే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం పుల్లాయ్యిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. కత్తి తో తల్లి వెంకటరత్తమ్మ మేడ పై దాడి చేసాడు. దింతో తీవ్ర రక్తస్రావమైన తల్లి నక్కల రత్తమ్మ(48)అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు శివయ్య ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అస్ది విషయంలో తల్లి కొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో తల్లిని కొడుకు కత్తితో దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలి. అధికారంలో ఉండగా చేయలేని పనులు వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా లక్షల మంది పేద కుటుంబాలలో వెలుగులు రాజశేఖర్ రెడ్డి నింపారు. అదే బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచాడు. వృద్ధులు, వికలాంగులు ఏనాయకుడు వద్ద పడిగాపులు పడకుండా 1వ తేదీన ఇంటివద్దనే ఫెంక్షన్ అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఒక్క సంక్షేమ పధకం కూడా ఆపలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులో కొన్ని అప్పులు చేయడం సహజం. గత ప్రభుత్వాలు అప్పులు చేయకుండా జేబులో డబ్బులు ఖర్చు చేశారా????? పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది పప్పు బెల్లాలు లాగా పెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ విధానాన్ని మార్చడం షావుకారులకు కడుపు మంటగా ఉంది. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా రాష్ట్రాన్ని అప్పులుపాలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడా కష్టం రాలేదు. కష్టం వచ్చింది కేవలం చంద్రబాబుకి మాత్రమే. ధనికులు పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదివితే ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే అర్ధం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని గ్రామాల్లో చెప్పి చేయలేని పరిస్థితి. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుంది.
శ్రీశైలం గోశాల గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలో రక్త పింజర పాము కలకలం రేపింది. సుమారు 4 అడుగుల రక్త పింజరి పాము కనపడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలోకి పాము రావడంతో గమనించిన సిబ్బంది, అధికారుల ద్వారా స్నేక్ క్యాచర్ రాజకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గో ఉత్పత్తి కేంద్రం వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్ రాజ పామును చాకచక్యంగా పట్టుకుని దట్టమైన అటవీప్రాంతంలో పామును వదిలిపెట్టారు.
నంద్యాల జిల్లా డోన్ మండలంలో సాధారణ వాహన తనికీల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్ ఆంధ్ర ప్రదేశ్ కు కట్టవలసిన రోడ్ టాక్స్ కట్టకుండా బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్ కు వెళ్తుండటంతో గుర్తించి వాహనానికి 404500/- జరిమానా విధించి బస్ ను సీజ్ చేయడం జరిగినది అన్ని డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక మినీ బస్ 265500/- జరిమానా వేసి సీజ్ చేయడం జరిగినది గత మూడురోజుల లో రెండు బస్సులకు గాను 670000/- జరిమానా విధించటం జరిగినది
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ 31,59,774 రూ విలువగల అక్రమ మద్యాన్ని, కళ్యాణదుర్గం పట్టణ శివారులో జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కంబదూరు, కుందుర్పి శెట్టురు, బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు రెండు సంవత్సరాల నుండి 159 కేసుల్లో పట్టుబడిన 2779 లీటర్ల మద్యం, 110 లీటర్ల నాటు సారా ను పట్టణ శివారులో ధ్వంసం చేశారు. ఈ అక్రమ మద్యం విలువ 31 లక్షల 51 వేల 774 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
శ్రీకాళహస్తి స్వామి వారి సేవలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. శ్రీకాళహస్తి స్వామి అమ్మ వారిని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవాళ్ళ తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు..
2024 ఎలక్షన్లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అదే విధంగా తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని టిడిపి నాయకులు ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఇసుక , మఠం భూములు ,ఎర్రచందనం మాఫియా లాగా అధికారుల అండదండలతో దొంగ ఓట్ల మాఫియా చేశారని ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, పులివర్తి నాని, నరసింహా యాదవ్ తో కలిసి దొంగ ఓట్లు పైన ఫిర్యాదు చేశారు .ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు .ఇప్పటికైనా అధికారులు దొంగ ఓట్ల పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు
టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. ఎవరు నడమవన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి ఈ ఉదయం ట్వీట్ చేశారు.గాలికుంటు, బ్లూటంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబూ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారం పోతే నీ బతుకేంటో తెలియక మెదడువాపు వ్యాధి వచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్నావని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. సప్తసముద్రాల అవతల దాక్కున్నా లాక్కొచ్చి తిన్నదంతా కక్కిస్తామన్నారు. పేలిన ప్రతీ తప్పుడు కూతకీ వాత పెట్టించి, బొక్కలో వేస్తామంటూ విజయసాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.





Total views : 201206