ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు లో వింత ఆచారం చోటుచేసుకుంది… గ్రామంలోని శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో శివ స్వామికి భక్తులు కారంతో అభిషేకాలు నిర్వహించారు… శ్రీ ప్రత్యంగిరి దేవి ఉప వాసుకలు ప్రతి ఏటా శివ స్వామీ కి కారంతో అభిషేకాలు చేస్తూ ఉంటారు… ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ప్రత్యేక హోమాలు నిర్వహించి ప్రత్యంగిరి దేవికి ఎంతో ఇష్టమైన 60 కేజీల కారంతో అభిషేక కార్యక్రమాల నిర్వహించారు…ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. శివ స్వామికి కారంతో అభిషేకాలు నిర్వహించారు..
Andhra Pradesh News
ఆయనొక ఏఈఓ … విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తూ.. ఆలయానికి వచ్చిన భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి.
కానీ ఆయన మాత్రం నోరు విప్పితే చాలు పచ్చి బూతులే.. గతంలోనూ పలుమార్లు బూతులు తిడుతూ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఆలయ సన్నిధి వద్ద విధులు నిర్వహించే అర్చకులను సైతం బూతులు తిడుతూ, ఒక ధర్మ కర్తను బూతులు తిడుతూ మాట్లాడిన తీరు పై.. పాలక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే సదరు ఏఈఓపై భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
చేతికొచ్చిన వరి పంట దక్కించుకోవడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు. ఆకాశం ఒక్కసారిగా మేగావృతమై చిరుజల్లులు పడటంతో పండించిన పంట చేతికి రాదేమోనని రైతు గుండెల్లో గుబులు మొదలైంది. కృష్ణ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలంలో బిపిటీ సన్న విత్తనాలతో రైతులు వరి సాగుచేశారు. చేతికొచ్చే పంటను కాపాడుకోవడానికి యంత్రాల సహాయంతో కోసి ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చుకున్నారు. ఒక్క ఎకరాకు 40 నుంచి 45బస్తాలు, హెక్టార్లుకు 100 నుంచి 115బస్తాల దిగుబడి వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 76 కేజీల ధాన్యం ధర 17వందల రూపాయలు… క్వింటాలు ధాన్యం ధర 2వేల 300 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తేలియజేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని చల్లపల్లి , మోపిదేవి, ఘంటసాల మండలాలలో రైతాంగం పలు రకాల వరి వంగడాలపై ఆసక్తి చూపారు. అయితే రైతులు ఆశించిన విధంగానే ఎకరాకు 38 నుంచి 44 బస్తాల దిగుబడి వస్తుంది. క్వింటల్ ధాన్యం ధర 2వేల 200 రూపాయలకు కోనుగోలు చేస్తున్నారు. మంచి దిగుబడి రావడంతో.. రైతులు పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది.
చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి. కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది. తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి, ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది. అయితే.. రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరుణం అసన్నమైoది. కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మికి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి. తెల్లవారి చూసే సరికి అరటి గెలలు నేలమట్టమయ్యి.. దర్శనం ఇచ్చాయి. సంవత్సర కాలం పంటల సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు వరలక్ష్మి. 6 సంవత్సరాలుగా పంటలు చేస్తున్నామని.. కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో నష్ట పరిహారం అందినదని.. నాటిన మొలకలకు కూడా 30 వేల ఆర్థిక సహాయం అందినదని హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తమ పరిస్థితి చూసి తమకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని.. సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది.
మ్యానిపెస్టోలోని సంక్షేమ పధకాలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు అంబటి రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి YSRCP ఆఫీస్ లో.. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్ విద్య అభ్యసిస్తున్నాడంటే అందుకు కారణం సీఎం జగన్ అన్నారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రతీ గ్రామంలోనూ వైద్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మరలా అధికారంలోకి తామే వస్తామని.. జగన్ సీఎంగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయమన్నారు. ఎంతటి వారికైనా కొన్ని లోటు పాట్లు వుంటాయని… అవి కూడా తొందర్లోనే పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో అని అన్నారు. ఎన్టీఆర్ మనవడు కాబట్టి రాజకీయాల్లో చెలామణి అవుతున్నాడని విమర్శలు చేశారు. ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్ళీ జగన్ ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రైవేట్ వ్యక్తులచే టిడిపి ఓటర్ వెరిఫికేషన్ చేయించడంపై నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఓటిపిల సేకరణతో ఫోన్లు హ్యాకింగ్ చేసే ప్రమాదం కూడా ఉందని, గతంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు. ప్రభుత్వం కేటాయించిన బిఎల్ఓ లు, పార్టీల బిఎల్ఏలు మినహా ఎవరు ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ఓటిపిలు అడిగిన పోలీస్ స్టేషన్ కు అప్పగించడం తథ్యం అని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.
మార్కాపురం నెహ్రు బజార్ లోని విజయలక్ష్మి క్లినికల్ & బయో కెమికల్ లాబరేటరీ యజమాని తాడి కేశవ ల్యాబ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు తాడి కేశవ జిల్లా ఏరియా ఆసుపత్రి లో కాంటాక్ట్ బేసిక్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వర్తించే వాడు. విధులనుండి తొలగించడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ లో ఈరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ ను గాయపరిచి గొలుసు లాక్కెళ్ళ టానికి దొంగ ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయటంతో మహిళ భర్త వెంకట రామిరెడ్డి బయటకు వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ లో ఈరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ ను గాయపరిచి గొలుసు లాక్కెళ్ళ టానికి దొంగ ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయటంతో మహిళ భర్త వెంకట రామిరెడ్డి బయటకు వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దొంగ వెంకట్రామి రెడ్డి నిపొడిచాడు . తీవ్రంగా గాయపడిన వెంకట్రామి రెడ్డిని అనంతపురం సవేరా హాస్పిటల్ కు బంధువులు తరలించారు.
చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగులు గుంపు భీభత్సం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళ రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది. తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి,ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది. రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరణం అసన్నమైoది.కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మి కి ఆశలు ఆవిరినాయి. ఒక్కసారిగా సోమవారం రాత్రి ఏనుగులు గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి. తెల్లవారి చూసే సరికి నేలమట్టంలో అరటి గెలలు దర్శనం ఇచ్చాయి.సంవత్సర కాల పంటలు సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. సంవత్సరాలుగా పంటలు చేస్తున్నాం, కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయి.కానీ 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చిన దాఖలాలు వైకాపా ప్రభుత్వంలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తెదేపా ప్రభుత్వంలో నష్ట పరిహారం అందినది. నాటిని మొలకలకు కూడా 30 వేలు ఆర్థికం అందినదని హర్షం వ్యక్తం చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క రూపాయి కూడ నష్ట పరిహారం అందలేదు..ఇప్పుడున్న మా పరిస్థితి చూసి మాకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. నేడు శ్రీవారి దర్శనం కోసం 06 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.50 కోట్లు. శ్రీవారికి 17,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.




Total views : 202809