ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్. APSRTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేలా ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని అమలుచేయనుంది ప్రభుత్వం. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబరు 3న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు సిఎం చంద్రబాబు. ఈ మేరకు ఆ పథకాన్ని ఇవాల్టి నుంచి అమలు చేయనున్నారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రిపై భేటీయై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
Babu
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు కట్టకూడదని అభ్యంతరం పెడితే ఎలా? ఇలాంటి ఆలోచనా విధానం వల్లే సమస్యలొస్తున్నాయని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అటవీశాఖ అధికారులు ప్రతిదానికీ అడ్డంకులు పెడుతున్నారని, ఏ పనీ ముందుకు సాగనివ్వడం లేదని కొందరు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి తీరుపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం చెలరేగింది. ఎమ్మెల్యేపై బండే శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేస్తూ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, అల్లుడి అండతో నియోజకవర్గంలో ఇసుక, బుసక అక్రమ తవ్వకాలు, మద్యం అధిక ధరలు, మరియు రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారని విమర్శించారు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని నిరూపిస్తా, బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఎమ్మెల్యేకు నేరుగా సవాల్ విసిరారు. ఒకే కూటమిలో ఉండి నేతలు ఇలా బాహాబాహీకి దిగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Babu Surety – Guarantee for future :
కందుకూరు పట్టణం 3 వ వార్డు దుర్గమ్మ గుడి ఏరియాలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని, దుర్మార్గపు పాలనకు ముగింపు పలకాలంటే, రాబోయే ఎన్నికల్లో టిడిపిని బలపరచాలని నాగేశ్వరరావు కోరారు. వార్డులో ప్రధానంగా సైడ్ కాలవలు, రోడ్ల నిర్మాణం గురించి స్థానికులు పదేపదే ప్రస్తావించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారని, పరిపాలన దారుణంగా ఉందని మహిళలు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వార్డులో కలియ తిరుగుతూ, చిన్నా పెద్దా అందరిని పలకరిస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. ఈసారి తమ ఓటు తెలుగుదేశం పార్టీకేనని స్పష్టంగా చెప్పిన మహిళలు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షులు పువ్వాడి కోటయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిత్తూరు జిల్లా.. నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్పంలో పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు ప్రజలనుండి వినతి పత్రాలు స్వీకరించి, 12 గంటలకు పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ఏర్పాటుచేసిన కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ నందు నిరుపేదలకు భోజనాలు అందిస్తారు. కుప్పంలోని పెద్దపులి గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కొత్తపేట పెద్ద మసీదులో మైనార్టీలతో కలిసి దువా లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు కుప్పం మండలం మల్లానూరు బస్టాండ్ లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం క్రిష్ణగిరి మీదుగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని, అక్కడి నుండి హైదరాబాదు చేరుకుంటారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎంచంద్రబాబు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరికొన్ని నెలల్లో ఎన్నికల జరగనున్న వేళ బాబు, పీకే కలవడం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ క్రమంలో బాబు, పీకే భేటీపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి ప్రాణం పోయడానికి ప్రశాంత్ కిశోర్ పనికిరాడని.. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే ప్రశాంత్ కిశోర్ పనికొస్తారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రశాంత్ కిశోర్ను చంద్రబాబు బీహార్ డెకాయిట్ అని విమర్శించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మళ్లీ అతడితోనే బాబు చేతులు కలిపాడని విమర్శలు గుప్పించారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు, లోకేష్ ఎలా దిగజారుతారో గుర్తు చేసుకోండని అన్నారు. ఎంతమంది ప్రశాంత్ కిశోర్లు వచ్చినా.. ఎంతమంది పవన్ కల్యాణ్లు వచ్చినా, ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం మాత్రం అసాధ్యమని సెటైర్ వేశారు.





Total views : 81456