ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసర లో అక్షరం వర్సెస్ బీజాక్షరం పై వివాదం ఏర్పడింది.. భక్తుల నమ్మకంతో పాటు అమ్మవారి భక్తుల మనోభావాలతో కొందరు ప్రయివేట్ వ్యక్తులు వ్యాపారం ప్రారంభించారని బాసర జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్ సభ్యులు ఆరోపించారు..బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అక్షరాభ్యాసాలకు ఫేమస్… అయితే ఏటా వసంత పంచమిరోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి.కదం తొక్కిన బాసర అర్చకులు మిగతా రోజుల్లోనూ ఈ తంతు కొనసాగుతూ ఉంటుంది… అయితే ఈ మధ్యకాలంలో కొందరు బాసరలో ప్రైవేటు దుకాణాలు తెరిచారని, వాళ్లు శాస్త్రవిరుద్దంగా నాలుకపై బీజాక్షరాలు రాసే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని అనుష్ఠాన పరిషత్ సభ్యులు ఆరోపిస్తున్నారు …బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠానా పరిషత్ ఆధ్వర్యంలో గోదావరి రోడ్ నుంచి ఆలయ ఈఓ కార్యాలయం వరకు ర్యాలీ బీజాక్షరాలు రాసే వారిని అరికట్టాలని నినాదాలు చేసారు అనంతరం ఆలయ ఈఓ కు వినతి పత్రం అందజేసిన అనుష్ఠానా వ్యవస్థాపకుడు యజ్ఞం పవన్ కుమార్ శర్మ.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
- రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
- నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్ అధికారుల సస్పెన్షన్.నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
- సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి