ఏలూరులో కేంద్ర దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ పర్యటించనున్నారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళన సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పూర్తి చేశారు. గోదావరి జిల్లాల క్లస్టర్ టు పరిధిలోని ఐదు పార్లమెంట్ల్ నియోజకవర్గాల నుంచి పదివేలమందికి మంది పైగా కార్యకర్తలు తరలివస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభనుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించి, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని నాయకులు అంటున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పై మంత్రి రోజా సెటైర్లు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90766