Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Devotional గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…

by Prakash
Gandhari Qilla Maisamma Jatara
Gandhari Qilla Maisamma Jatara :

మందమర్రి మండలం బొక్కల గుట్ట లో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర గత మూడు రోజులుగా ఆదివాసీ నాయక్ పొడ్లు, రోడ్డ వంశస్థులు గిరిజన సంప్రదాయ పద్దతులలో ఘనంగా నిర్వహించారు. జాతర చివరి రోజున చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతనపల్లి చైర్ పర్సన్ జంగం కళలు గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి జాతర లో పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి కాల భైరవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Follow us on : FacebookInstagram & YouTube.

జీడికోట లో ఏర్పాటు చేసిన దర్బార్ లో చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి తోపాటుగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ నాయక్ పొడు కుల పెద్దలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ లో ఆదివాసీ నాయక్ పోడ్ లో ఆదివాసీ ల ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో సౌలత్ లు లేకా భక్తులు ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మేల్యే స్పందించి
గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం కింద త్రాగునీరు,విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాననీ ఆదివాసీలకు హామీ ఇచ్చారు. అలాగే గాంధారి ఖిల్లాను టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకేళ్లుతాననీ భరోసానిచ్చారు.

Read Also…

Advertisements

You may also like

Our Visitor

036133
Total views : 180973

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.