నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు. అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు అని, ఎందరికో ఆదర్శవంతుడు అంబేద్కర్ అని అన్నారు. పట్టణంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Breaking News
పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని, పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు. మెట్టపైలు అయినా సెనగ, పొగకు, మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. తుఫాను గురించి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రభుత్వం నిమ్మకు నీరేతిన్నట్టు వ్యవహరించి రైతు జీవితాలతో ఆడుకుందని దుయ్యబెట్టారు. గత ప్రభుత్వంలో వెంటనే వ్యవసాయ అధికారి ను గ్రామాల్లోకి పంపించి నష్టం నివారణ ఎక్కువ జరక్కుండా తగు చర్యలు తీసుకున్నామని, కానీ నేటి ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమి తీసుకోకపోగా కనీసం నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం కూడా చేయటం లేదని ఎద్దేవా చేశారు. వదిలేసిన రైతులు సుమారు 50 వేల రూపాయలు నష్టపోయినట్టు, మెత్త పైడ్ చేసిన ఒక్కొక్క రైతు సుమారు లక్ష రూపాయలు నష్టపోయినట్టు రైతులు తెలిపారు. వారికి వెంటనే నష్టపరిహారం కింద వడివేసిన రైతులకు సుమారు 40000 రూపాయలు, మెట్ట పైరు వేసిన రైతులకు 70 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో వరంటీల్ ద్వారా నిజమైన నష్టపోయిన రైతులకు కాకుండా తమ పార్టీ కార్యకర్తలకు నష్టం నివారణ నగదు వెళ్లిందని, కానీ నేడు అలా జరిగితే రైతులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకో చెయ్యిల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తుఫాను ప్రభావం తో శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులుగా మోస్తారుగా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట నేలకొరిగి నీట మునగడంతో రంగు మారే అవకాశం ఉందని, ప్రభుత్వం రంగు మారిన ధాన్యాన్ని కొని తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో ఏలేస్వరం ప్రత్తిపాడు మండలాలో భారీ వర్ష పాతం నమోదు అయ్యింది. భారీ వర్షం కారణంగా నాలుగు మండలాలలో వరి, అరటి పలు వాణిజ్య పంటలు సుమారుగా వందలాది ఎకరాల్లో నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా వరి చేలు పూర్తిగా నీటమునిగాయని, ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయని పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని కన్నీరు పర్యతమయ్యారు. ప్రభుత్వ వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
కృత్రిమ మేధ (AI) రంగంలో ఇటీవలి పురోగతితో, AI న్యూస్ రీడర్లు వార్తలు వినడం యొక్క కొత్త మార్గాన్ని అందిస్తున్నాయి. ఈ AI-ఆధారిత సాధనాలు టెక్స్ట్-టు-స్పీచ్ (TTS) టెక్నాలజీని ఉపయోగించి న్యూస్ ఆర్టికల్స్ను చదివి, వినియోగదారులకు వినడానికి సులభమైన మార్గాన్ని అందిస్తాయి.
AI న్యూస్ రీడర్లు వార్తలను వినడం ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా చేస్తాయి, ఎందుకంటే వినియోగదారులు ఇకపై వార్తాపత్రికలు లేదా వార్తా ఛానెళ్లను చూడవలసిన అవసరం లేదు. ఈ సాధనాలు చేతిలో ఉన్నప్పుడు, వినియోగదారులు వారి ఇళ్లలో, కార్లలో లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా వార్తలను వినవచ్చు.
AI న్యూస్ రీడర్లు వ్యక్తిగతీకరించిన వార్తా అనుభవాలను కూడా అందిస్తాయి. వినియోగదారులు తమకు ఆసక్తి ఉన్న అంశాలను ఎంచుకోవచ్చు, AI న్యూస్ రీడర్లు ఆ అంశాలకు సంబంధించిన వార్తలను మాత్రమే చదివిస్తాయి.
ఇప్పటికే అనేక AI న్యూస్ రీడర్లు అందుబాటులో ఉన్నాయి, మరిన్ని రూపొందించబడుతున్నాయి. అత్యంత ప్రజాద్రిపొందిన AI న్యూస్ రీడర్లలో కొన్ని ఉన్నాయి:
- Amazon Polly
- Google Cloud Text-to-Speech
- Microsoft Azure Text-to-Speech
AI న్యూస్ రీడర్లు ఇంకా తమ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, అవి వార్తలను వినడం యొక్క భవిష్యత్తును మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. AI న్యూస్ రీడర్లు వార్తలను వినడం ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా చేయడమే కాకుండా, వ్యక్తిగతీకరించిన వార్తా అనుభవాలను కూడా అందించగలవు. AI న్యూస్ రీడర్లు వార్తలను వినడం యొక్క మార్గాన్ని మారుస్తున్నాయి, మరియు అవి భవిష్యత్తులో ఇంకా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.
కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజవర్గ ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పు ఇస్తారు. వరుసగా రెండుసార్లు ఎవరినీ గెలిపించరు. అదే విధంగా స్థానికేతరులనే గెలిపిస్తారు. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి మూడు పార్టీలు టికెట్లు ఆశిస్తున్నాయి. కానీ టిడిపి, జనసేన పొత్తులో ఉన్నాయి. మరో పక్క వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు రాదన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం పిఠాపురం నుంచి పెండెం దొరబాబు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు అసమ్మతి అధికంగా ఉంది. పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలలో పలు దఫాలు ఆయనను నిలదీశారు. కొత్తపల్లి మండలంలో రెండు వర్గాలు కేసులు పెట్టుకున్నాయి. ఇదే మండలంలోని నాగులాపల్లి లో ఎమ్మెల్యేను పరుగులు పెట్టించారు. దీనికి తోడు ఆయన సొంత అల్లుడు జనసేనలో చేరారు. దీంతో ఈసారి ఆయనకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది. కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా ఉండి, గతంలో పీఠాపురం ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం నుంచి ఎన్నికైన వంగా గీత ఈసారి పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం కూడా సానుకూలంగానే ఉందని వార్తలు వస్తున్నాయి. ఆమెకు టికెట్ ఇస్తే దొరబాబుకు టికెట్ లేనట్టే లెక్క. దీంతో గీత చాప కింద నీరులా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో జనసేన బలంగా ఉండడంతో కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్, పిఠాపురం జనసేనకు కేటాయిస్తారు అని ప్రచారం జరుగుతోంది. అలా చేస్తే వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 2014లో కూడా టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అనంతరం టిడిపిలో చేరారు. ఈసారి కూడా అదే ధీమాతో ఉన్నారు. ప్రతిరోజు జనసేన, టిడిపి మధ్య అధిపత్య పోరు జరుగుతోంది. ఆత్మీయ సమావేశంలోనే కొట్టుకున్నారు కూడా. ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా నూతనంగా టీ టైం అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయనకు క్యాడర్ కు పొసగడం లేదు. అదే విధంగా ఆయన జనసేన ఇన్చార్జిగా ఉండగా టిడిపి ఇన్చార్జి వర్మతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు జనసేన టికెట్ ఇస్తుందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. అదే జరిగితే పొత్తుల్లో ఉన్న వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు, టిక్కెట్ ఆశిస్తున్న వంగా గీత, ఎస్వీఎస్ఎన్ వర్మ, తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వీరంతా కూడా స్థానికేతరులే. పిఠాపురం ఓటర్లు వరుసగా రెండుసార్లు గెలిపించరు అన్న సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకుని ఈసారి దొరబాబు కు టిక్కెట్ ఇవ్వరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పిఠాపురం కోటకు కాబోయే రాజెవరు ..? పిఠాపురం కోటలో ఏ జెండా ఎగురుతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Read Also..
వైద్యం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు. ఇదే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. రాజకీయ కార్యకలాపాలను చక్కబెట్టే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారంటూ విమర్శించింది. వైద్యం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు… ఇదే పనిలో ఉన్నారని దుయ్యబట్టింది.జైల్లో చంద్రబాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ టీడీపీ అండ్ కో పెద్ద కలరింగ్ ఇచ్చిందని తెలిపింది. రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని నివాసానికి 14 గంటలు కారులో ప్రయాణించిన బాబు… హైదరాబాద్ లో జనసేనాని పవన్ కల్యాణ్ తో దాదాపు 2 నుంచి 3 గంటల సేపు రాజకీయ చర్చలు జరిపారని విమర్శించింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఇవన్నీ చేయగలరా? అని ప్రశ్నించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించింది.చంద్రబాబు బెయిల్ తీసుకుంది వైద్యం కోసమా? లేక రాజకీయాలు చేసేందుకా? అని వైసీపీ ప్రశ్నించింది. బెయిల్ కోసం చెప్పిన ఆరోగ్య సమస్యలు ఇప్పుడు నయమైపోయాయా? అని ఎద్దేవా చేసింది. వైద్యం కోసమే అయితే జైలు నుంచి విడుదల రోజున రాజకీయ ర్యాలీలు ఎందుకని ప్రశ్నించింది. హైదరాబాద్ లో రాజకీయ మంతనాల కోసమే బెయిల్ తీసుకున్నారా? అని నిలదీసింది.
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 194163