తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి, సిపిఐ అనుబంధ ఎఐటియుసి, బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి.
cpi
ఏపీ సీఎం జగన్పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే.. ఏపీలో జగన్ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజానీకానికి భాజపా వ్యతిరేకంగా ఉందని.. అయితే, ఆ పార్టీకి అనుకూలంగా జగన్ ఉన్నారని మండిపడ్డారు. ఏపీలోనూ అధికార మార్పిడి ఖాయమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీచేస్తామని నారాయణ ప్రకటించారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు ఆర్టికల్ 370 పై వచ్చిన తీర్పు చాలా దురదృష్టకరమని అన్నారు. జమ్ము కాశ్మీర్ పైన
370 అర్టికల్ పైన వచ్చిన తీర్పు దురదృష్టకరమని, న్యాయ వ్యవస్థ ఒక పంజరంలోని చిలుకగా మారిపోయింది అని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీలకు దాని ప్రాధాన్యత ఎలా తెలుస్తుందని, అందుకే 370 అర్టికల్ గురించి వారికి తెలియడం లేదని ఆవేదన చెందారు. భారతదేశాన్ని విడగొట్టే రీతిలో బిజెపి పాలన సాగుతోందని,చివరకు నిజాంకు వ్యతిరేకంగా కూడా బిజెపి పోరాడలేదుని ఆరోపించారు. సుప్రీంకోర్టు తప్పు చేసిందని చెబుతున్నా ఇలా అన్నాఅని తనను అరెస్ట్ చేసినా ఫర్వాలేదు అన్నారు.సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ డెకాయిట్లతో సైతము రాజీపడ్డాడు అని ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో వీరుచుకుపడ్డారు నారాయణ… తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఎపిలో పునరావృతం కాబోతున్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని, అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యేలకు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచేసిన తరువాత ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ఉపయోగమేంటి అని ప్రశ్నించారు.ఇన్చార్జ్ లు, ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు వైసిపిలో సిఎం అభ్యర్థినే మార్చాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, పాలన చేతకాకపోవడం వలననే వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలు అన్నారు. గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి అదే గాల్లోనే కలిసిపోతాడు అన్నారు. పొగరు, అవినీతి, అహంకారంకు కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బైజ్యూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, బైజ్యూస్, బజాజ్ కార్యాలయాలను పగులగొట్టండి అని అన్నారు. తుఫాన్ వల్ల తిరుపతి జిల్లాలో 60వేల ఎకరాల్లో వరిపంట నష్టం జరిగిందని, 18లక్షల ఎకరాలలో అన్ని రకాల పంట నష్టం జరిగిందని, మిచౌన్ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసారు.
కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. పర్యాటక శాఖ మంత్రి, ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగింది. ప్రభుత్వం మారిందని అడ్మినిస్ర్టేషన్ కార్యాలయాన్ని తగలబెట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదని నారాయణ వ్యాఖ్యానించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని జరగబోవు ఎన్నికలలో రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఐ ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి శ్రీనివాస్ ఈ రోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. టీ.శ్రీనివాస్ మాట్లాడుతు….పేదలకు మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి వంటివి వారి కార్యకర్తలకు మత్రమే ఇచ్చుకున్నారు తప్ప పేద ప్రజలకు ఇచ్చింది లేదని పల్లె ప్రగతి వనాలని క్రీడా ప్రగాణాలని డంప్యాడ్లని దళిత భూములను గుంజుకున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజా ప్రతినిధులు అమ్ముకున్నారు తప్ప పేదవానికి ఒక గుంట జాగ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ కార్మికులు రైతాంగం ప్రజలు తలరాతలు మారుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందని అన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తెలంగాణ ఉద్యమ సమయంలో స్వచ్ఛందంగా పాల్గొని పోరాటం చేసిన కార్మికులను పర్మినెంట్ చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయలేదని సూచించారు. సింగరేణి పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని కొత్త బొగ్గు బావులు తవ్వి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఒక్క భూగర్భ బావిని తవ్వలేదని ఓసీలనే ప్రోత్సహిస్తూ జన సందోహానికి ఆటంకం కలిగిస్తున్నారు తప్ప కొత్త బావులు తవ్వట్లేదని తెలిపారు ఈ సమావేశం లొ పట్టణ ఇఫ్ట్ iftu జాఫర్ నాయకులు పాల్గొన్నారు.
Read Also..
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ భారత కమ్యునిస్టు సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి కేతురు వెంకటేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ ఫయాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల అనేది సాధారణంగా జరిగిన ఎన్నికలు కావని బిజెపి పార్టీ తన స్వలాభం కోసమే కుత్రిమంగా ఏర్పాటు చేసిన ఎన్నికలని అక్కడ బీజేపి నీ వ్యతిరేకించడానికి టిఆర్ఎస్ తో జతకట్టడం జరిగిందని కమ్యూనిస్టు పార్టీఅనేది ఈదేశ ప్రజలను కాపాడాలని ఉద్దేశంతో ఉన్నటువంటి మద్దతుగా నిలబడే పార్టీ అనే మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి చేసిన కుట్రలను తిప్పికొట్టేందుకే ఆ రోజుల్లో టిఆర్ఎస్ కి మద్దతు పలకడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలబడిందని అన్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ లిక్కర్స్ స్కాంలో తన కూతురు కవితను కాపాడుకునే ప్రయత్నంలో బిజెపితో జతకట్టారనే విషయం తెలవడంతో ఆ పార్టీ నుంచి తాము విడిపోవడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీ మద్దతు తెలుపుతున్నామని కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గెలుపుకు కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు ఉండి వారి గెలుపు కృషి చేస్తామని మరి కాంగ్రెస్ నాయకులు జూపల్లి గారు కూడా గెలిచిన అనంతరం అన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని నడవాలని ఈ సందర్భంగా కోరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాది పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల హక్కుల కోసం అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న గొప్ప పార్టీని ఆయా ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకులు నిరంతరం ప్రజాసేవకే అంకితం అయి ఉంటారని నిరంతరం ప్రజల కోసమే పోరాటాలు నిర్వహిస్తారని మరి అలాంటి పార్టీ తమకు మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయమని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం కమ్యూనిస్టు పార్టీని నాయకులను కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని అన్ని సందర్భాల్లో వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వరరావు పగడాల శ్రీనివాస్ రెడ్డి ఏఐసిసి నాయకులు కేతురు వెంకటేష్, పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా చండూర్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యే గా గెలిచిన. కేసీఆర్ గద్దె దింపడం బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంతో సాధ్యం అనే నమ్మకం తో పార్టీ మరీనా. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేతిలో పెట్టుకొని లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడం దారుణం. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ఒ కటయ్యాయి. నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే, అది బీజేపీ తో సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తుంది,కేసీఆర్ గద్దె దింపడం కాంగ్రెస్ తోనే సాధ్యమని తిరిగి సొంత పార్టీకి వచ్చిన. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్లే బిఅర్ఏస్ గెలిచింది. పేదల పార్టీ ,ఆత్మగౌరవం తో పని చేసే నాయకులు కమ్యూనిస్టులు. ఉప ఎన్నికల్లో మీ లక్ష్యం బీజేపీ ఓటమి, రాజగోపల్ రెడ్డి మీద శత్రుత్వం కాదని తెలిసిపోయింది.
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో రేవంత్ భేటీ అయ్యారు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు నిర్వహించారు. . అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసే విషయంలో ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐకి కొత్తగూడెం టికెట్తో పాటు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేసేందుకు సీపీఐ ఆలోచన చేసినా అందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీనికి సీపీఐ నాయకత్వం సైతం సుముఖత తెలపడంతో సీట్ల సర్దుబాటు అంశం దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ఇవాళ సీపీఐ నేతలతో రేవంత్ రెడ్డి ఫైనల్ డిస్కషన్స్ చేసి పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు.
అల్లూరి జిల్లా చింతపల్లి లో సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర లో భాగంగా చింతపల్లి కి నాలుగవ రోజు చేరుకున్న రాష్ట్ర సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు ఈ సందర్భంగా చింతపల్లి పాత బస్టాండ్ వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి బోనంగి చిన్నప్పడాల్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావుకు హారతి ఇచ్చే ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వెనుకబడి ఉన్న అల్లూరి సీతారామ జిల్లా మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థ ఆదానికి భూములు ముట్ట చెప్పడానికి చూస్తుందని అల్లూరి సీతారామ జిల్లాలో ప్రతి మారుమూల గ్రామం కూడా అభివృద్ధి చేయవలసింది పోయి వెనకబడిన ప్రాంతముగా చేయబోతున్నారని అలా జరిగితే మన్య ప్రజలందరూ ఒకటిగా కూడి అడ్డుకుంటామని ఆయన అన్నారు.
Read Also..






Total views : 90956