Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home TelanganaMahabubnagar సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం..

సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం..

by Rama
CPI party

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ భారత కమ్యునిస్టు సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి కేతురు వెంకటేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ ఫయాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల అనేది సాధారణంగా జరిగిన ఎన్నికలు కావని బిజెపి పార్టీ తన స్వలాభం కోసమే కుత్రిమంగా ఏర్పాటు చేసిన ఎన్నికలని అక్కడ బీజేపి నీ వ్యతిరేకించడానికి టిఆర్ఎస్ తో జతకట్టడం జరిగిందని కమ్యూనిస్టు పార్టీఅనేది ఈదేశ ప్రజలను కాపాడాలని ఉద్దేశంతో ఉన్నటువంటి మద్దతుగా నిలబడే పార్టీ అనే మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి చేసిన కుట్రలను తిప్పికొట్టేందుకే ఆ రోజుల్లో టిఆర్ఎస్ కి మద్దతు పలకడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలబడిందని అన్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ లిక్కర్స్ స్కాంలో తన కూతురు కవితను కాపాడుకునే ప్రయత్నంలో బిజెపితో జతకట్టారనే విషయం తెలవడంతో ఆ పార్టీ నుంచి తాము విడిపోవడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీ మద్దతు తెలుపుతున్నామని కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గెలుపుకు కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు ఉండి వారి గెలుపు కృషి చేస్తామని మరి కాంగ్రెస్ నాయకులు జూపల్లి గారు కూడా గెలిచిన అనంతరం అన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని నడవాలని ఈ సందర్భంగా కోరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాది పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల హక్కుల కోసం అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న గొప్ప పార్టీని ఆయా ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకులు నిరంతరం ప్రజాసేవకే అంకితం అయి ఉంటారని నిరంతరం ప్రజల కోసమే పోరాటాలు నిర్వహిస్తారని మరి అలాంటి పార్టీ తమకు మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయమని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం కమ్యూనిస్టు పార్టీని నాయకులను కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని అన్ని సందర్భాల్లో వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వరరావు పగడాల శ్రీనివాస్ రెడ్డి ఏఐసిసి నాయకులు కేతురు వెంకటేష్, పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026145
Total views : 149967

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.