ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించారు. ఎకరానికి ఆహార పంటకు 50,000 ఉద్యానవన పంటలకు 75000 వాణిజ్య పంటకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలి. పంట బీమా వాతావరణ బీమా పథకాలను అమలు చేసి పూర్తిగా నష్టపరిహారం ఇప్పించాలి. ఖరీఫ్ లో బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలి. వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల గురించి పంట నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలి. వేదాద్రి చింతలపూడి లాంటి చిన్న మధ్య తరహా ఎత్తిపోతల పథకాన్ని అన్ని అన్నింటికీ నిధులు కేటాయించి పూర్తి చేయాలి. నిల్వమున్న పంటలను కాపాడుకోవడానికి పగటిపాడు తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వాలి. రబిలో పంటలు వేయడానికి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ పనులు లేని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి రోజుకు 600 చొప్పున సంవత్సరానికి 1200 రోజులు పని కనిపించాలి. రబి పంటలకు అవసరమైన విత్తనాలను ఎరువులను పురుగుమందులను ప్రభుత్వం అందించాలి.
Tag: