భారతమాల, రీజినల్ రింగ్ రోడ్ RRR భూసేకరణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ త్వరిగతిన పూర్తి చేయాలని లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు -RRR భూసేకరణ కోసం NHAI కి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి …సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. RRR భూసేకరణ కోసం నాయ్ కు 50 శాతం నిధులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
crime news
ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్ర – కర్ణాటక ప్రభుత్వాలతో కలిపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తానని మంత్రి తుమ్మల రైతులకు హామి ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండలం, అల్లిపల్లి గ్రామంలో ఆంధ్ర పామాయిల్ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి నిర్ణయాల వల్ల పామాయిల్ రైతాంగానికి అపార నష్టం వస్తుందని రైతులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న12 వేల చిల్లర ధర.. గిట్టుబాటు కావడం లేదని లేబర్ కాస్ట్ , ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరిగిపోవడంతో కనీసం 18 వేలకు మద్దతు ధర అయితే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కేంద్రంపై పోరాడితే సరిపోదని తెలంగాణ, కర్ణాటక కూడా సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారని తుమ్మల అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని.. మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలని అమలు చేయకపోతే బట్టలు విప్పి కాంగ్రెస్ నేతలను నడిరోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల పేరుతో హామీల అమలును వాయిదా వేయాలని చూస్తోందని.. ఎంపీ ఎన్నికలకు ముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పెద్ద ఓటమేమి కాదని.. 39 సీట్లు రావడం చిన్న విషయం కాదని అభిప్రయపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని.. కేసులకు ఎవరూ భయపడొద్దని, తాము అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు.
ఏ లక్ష్యం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో 20 రోజుల్లో మూడేళ్లు అవుతుందని… అప్పటి నుంచి నా రాజీనామా ఆమోదించకుండా.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నా రాజీనామాను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని గంటా మండిపడ్డారు. రాజ్యసభలో నా ఓటు హక్కు వినియోగించుకుంటానని, దీనికోసం న్యాయ పోరాటం చేస్తానన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తున్నాయని మండిపడ్డారు.. నన్ను అడగకుండా రాజీనామాను ఆమోదించారని, కుట్ర కోణంతో వైసీపీ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ కు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ముందా అంటూ గంటా ప్రశ్నించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు.
అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు తెలిపారు. మా పార్టీకి, అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉందని… కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరేందుకేనని అనడం ఎంతవరకు సమంజసమని కొత్తకోట ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. మా నియోజకవర్గంలోని ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రిని కలిశామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరో వందసార్లు కలుస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. తాను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలో అని, చనిపోయేంత వరకూ పార్టీలోనే కొనసాగుతానని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తమకు లేవని తేల్చి చెప్పారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. నిన్నటి నష్టాలకు చెక్ పెట్టేశాయి. తొలుత నష్టాలతో మొదలైన సూచీలు ఇంట్రాడేలో బాగా కోలుకున్నాయి. ఒడిదుడుకులకు లోనయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానకి బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ – బీఎస్ఈ సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 71,060 వద్ద ముగిసింది. దీంతో మరోసారి 71 వేల మార్కు అధిగమించినట్లయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజీ – నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగింది. 215 పాయింట్ల లాభంతో 21,453 వద్ద నిఫ్టీ పరుగు చాలించింది. బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్లు, ఫైనాన్స్ నిఫ్టీ 67 పాయింట్లు పైకి ఎగశాయి. నిఫ్టీలో హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొ, హెచ్.సి.ఎల్ షేర్లు అదరగొట్టాయి. సెన్సెక్స్ లో ఐ.ఎఫ్.సి.ఐ, బాంబే డయింగ్, హెచ్ఎఫ్సీఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, మిశ్రధాతు నిగమ్ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జించాయి.
శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం పట్టణంలోని ముక్కిడి పేటలో గల మున్సిపల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్ కు తెలపడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు అయితే మంటలు పెరిగిపోవడంతో పూర్తిగా దగ్ధమైంది మున్సిపల్ అధికారులు పరిశీలించి పాతయంత్ర సామాగ్రి, రీసైక్లింగ్ అట్టపెట్టెలు రేకుల షెడ్డు మొత్తంగా 16 నుండి 18 లక్షల వరకు హిందూపురం మున్సిపాలిటీకి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు. నకిరేకల్ కు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కోనుగోలు చేస్తుండగా వారిని నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయి మరియు సేవిస్తున్నా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా వీరు జల్సాలకు అలవాటు పడి గంజాయి మత్తుకు బానిసైతున్నారాని. నకిరేకల్ లో మాదకద్రవ్యాలు విక్రయించే స్థావరాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నకిరేకల్ సిఐ రాజశేఖర్ తెలిపారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అనుమానంతో అమ్మాయి అన్న అతని ఆరుగురు స్నేహితులు కలిసి మైనర్ బాలుడు మరియు అతని ఇద్దరు స్నేహితులను స్వగ్రామ మైన ముక్తాపూర్ వద్ద పొలం గట్ల మధ్య తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడంతో పాటు ఐరన్ రాడులను కాల్చి వాతలు పెట్టారు అర్ధరాత్రి ఐనా పిల్లలు రాలేదని తల్లిదండ్రులు వారికి ఫోన్ చేయడంతో సదరు మైనర్ బాలురను వదిలిపెట్టిన నిందితులు. దెబ్బలను గ్రహించిన తల్లిదండ్రులు మందలించడంతో బయటికి వచ్చిన పూర్తి వ్యవహారం తెలుసుకొని, తెల్లవారుజామున పోలీస్ స్టేషన్లో బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా బాధితులు. నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపిన భూదాన్ పోచంపల్లి పోలీసులు.