గుంటూరు జిల్లా కు చెందిన రామినేని మహేష్ బాబు(32) ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చీ రామచంద్రపురం LIG కాలనీ లో నివాసం ఉంటున్నాడు. నగరం లోని ఓ కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేష్ బాబు. పని నిమిత్తం మియాపూర్ కు స్కూటీ పై వెళ్తున్న మహేష్ బాబు ను వెనుక నుండి అతి వేగంగా వచ్చి డీ కొట్టిన డీసీఎం వాహనం. తీవ్ర రక్తస్రావం అయిన మహేష్ బాబు ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలింపు. భార్య రత్నంబా ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
crime news
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో గొల్లపాలెం నుంచి ద్రాక్షారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున లోకేష్ కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నేతృత్వంలో జనసేన సహకారంతో రెండు పార్టీలు అధికారంలోకి రావాలని కోరుతూ పూజలు నిర్వహించారు. వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కని విని ఎరుగని రీతిలో స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి తన యువగళం ద్వారా కొత్త ఉత్సాహాన్ని తెచ్చిన లోకేష్ మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసామని అదే విధంగా లోకేష్ ఆసయాలకు అనుగుణంగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించమని వీర్రాజు చౌదరి తెలిపారు.
నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు. వైయస్సార్ జగనన్న భూ సురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాలు భూమిని సర్వే అధికారులు, సిబ్బంది ఎక్కువగా చూపుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. గ్రామంలో మొత్తం 2,900 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం సర్వే అనంతరం 3,300 ఎకరాలు భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వే వలన గ్రామంలో కలహాలకు ఆజ్యం పోస్తున్నట్లు ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు భవిష్యత్తులో అమ్మకాలు కొనుగోలు జరిగిన సమయంలో, ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు వాపోతున్నారు. నేడు జరుగుతున్న సర్వే వలన కొంతమంది రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని కోల్పోతుండగా, మరి కొంతమంది రైతులకు అదనంగా భూమి కలుస్తుందని రైతులు చెబుతున్నారు. గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు, పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు, రైతులు తెలుపుతున్నారు. తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దళిత మహిళ భువనేశ్వరి మీడియా ముందు మాట్లాడారు. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తాను 17వ వార్డు నుంచి ఇనామనస్ గా కౌన్సిలర్ గా ఎన్నికయ్యానని తెలియజేశారు.. 40 లక్షలు ఇస్తే తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తెలిపారని పేర్కొన్నారు. తాను మూడు విడతలుగా ఆయనకు 40 లక్షల రూపాయలు అందజేశానని వివరించారు. అయితే తనకు ఇప్పటివరకు పదవి ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు. తన డబ్బులు ఇవ్వకుంటే మంత్రి రోజా ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు మండలంలోని ఈ గోకవరంలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ ను, కిత్తమురుపేటలో గల చంద్రబాబు సాగర్ ను, ఏలేశ్వరం మండలంలో ఏలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ ప్రాజెక్టు అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని ఆమె అన్నారు. సుబ్బారెడ్డి సాగర్ కు పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. అలాగే చంద్రబాబు సాగర్ కు పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ నిండుకుండలా ఉండే ఏలేరు ప్రాజెక్టుకు మరింత నీరు అందించేందుకు పురుషోత్తమ పట్నం పనులు చేపట్టి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్కు గత ప్రభుత్వంలో నీరు అందించడం జరిగిందని అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా నీరు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలూరు ప్రాజెక్టు నుండి స్టీల్ ప్లాంట్ కు వెళ్లే నీటిని శంఖవరంలో ఒక కెనాల్ ను, పెద్దిపాలెంలో ఒక కెనాల్ ను ఏర్పాటు చేసి రైతులకు నీరు అందించే విధంగా చూడాలని అన్నారు.
సీఎం జగన్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బండారుమాధవ నాయుడు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం ప్రజలను ఎమ్మెల్యే మూడు సార్లు మోసగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కోసం జిల్లా కేంద్రంను తాకట్టు పెట్టారు. నరసాపురం నుంచి భీమవరానికి జిల్లా కేంద్రం తరలించారు. ఈ విషయం భీమవరం లో జరిగిన సీఎం సమావేశంలో పలువురు మాట్లాడారు. నరసాపురంలో మంజూరైన మెడికల్ కాలేజీను తరలించారు. రూ. 3,200 కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రజలను దగా చేశారు. 14 నెలలు గడిచినా బటన్ నొక్కిన పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజలకు సిఎం, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేసిన మోసాలకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో కు విన్నతి పత్రం అందజేశారు.
భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ క్రిష్ణయ్యలపై 31 మంది అవిశ్వాస తీర్మానం కోరారు. అయితే ఆర్డీవో అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరుపగా అనుకూలంగా 31మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్తో సహా మొత్తం 36 మంది ఉండగా.. 31 మంది ఆమోదం తెలిపినట్లు ఆర్డీవో అమరేందర్ పేర్కొన్నారు. అయితే ఆమోదం తెలిపిన 31 మంది కౌన్సిలర్లలో 16 మంది టిఆర్ఎస్ తొమ్మిది మంది కాంగ్రెస్ ఆరు మంది బిజెపి కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్ తో సహా మిగతా ఐదుగురు మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆబోతుల కిరణ్ కుమార్, చెన్న స్వాతి మహేష్, ఏనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య అవిశ్వాస ప్రక్రియకు గైర్హాజరయ్యారు. అయితే ఆమోదం తెలిపిన నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తున్నామని తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆర్డిఓ అమరేందర్ మీడియా ముందు వెల్లడించారు.
వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసరప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను, బోనాల నైవేద్యాలను సమర్పించుకొని సేవలో తరించారు. తమ ఇంటిల్లిపాదినీ పిల్లాపాపలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం కావటం, దీనికి తోడు సమ్మక్క సారళమ్మ జాతరకు ముందు అంజన్నను దర్శనం చేసుకోవటం అనవాయితీ కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అంజన్నను దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి గంట సమయం పడుతోంది. క్యూలైన్లు నిండి వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆయల అధికారులు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అక్రమ కట్టడాలపై బల్దియా అధికారులు కొరడా జులిపించారు. పార్కింగ్ స్థలాలలో ఉన్న కట్టడాలను తొలగించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఉదయం వరంగల్ చౌరస్తా నుండి ఎంజీఎం జంక్షన్ వరకు పార్కింగ్ స్థలాలలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని తొలగించారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు తాము అక్రమ నిర్మాణాలు కూల్చివేసామని ఇకనైనా రోడ్డు సైడ్ ఉన్న వ్యాపారులు నిర్మాణం కోసం తీసుకున్న పర్మిషన్ లో నిర్మాణాలే చేపట్టాలని పార్కింగ్ స్థలాలలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు.



Total views : 141735