కృష్ణాజిల్లా, అవనిగడ్డ నాగాయలంక మండలం పెద్ద పాలెం గ్రామంలో దారుణం. తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన యువతి యొక్క తండ్రి,, తమ్ముడు. షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు అవటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హుస్సేన్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి రిఫర్ చేసిన వైద్యులు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాగాయలంక పోలీసులు.
Crime
నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కుప్పకూలిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు వారంతా శ్రమిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులు జరుగుతుండగా చర్చి స్లాబ్ సడెన్ గా కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు. మరో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also..
Read Also..
పుద్దిచ్చేరి యానాం దరియాలతిప్ప వద్ద మత్స్యకార బోట్లు దగ్ధమయ్యాయి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. బైరవపాలెంకు చెందిన మత్స్యకార బోట్ కు దరియాలతిప్ప వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడి ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో కామాడి గంగాద్రి అనే బోట్ యజమాని సజీవదహనం అయ్యాడు. మరో ఇద్దరు సురక్షింతగా బయట పడ్డారు. బోట్ రిపేర్ కావడంతో దరియాలతిప్ప వద్ద రిపేర్ చేసుకోవడానికి వచ్చినట్లు యానాం పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
Read Also..
పూణేకు చెందిన ఓ గ్యాంగ్స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడుపిస్తోళ్లు, మూడు మ్యాగజైన్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 1.30 సమయంలో సుతార్దారా ప్రాంతంలో గ్యాంగ్స్టర్ మొహొల్ (40)పై నలుగురు దుండగులు పాయింట్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ అతడి చాతీని చీల్చేయగా, మరో రెండు అతడి కుడిభుజంలోకి చొచ్చుకెళ్లాయి. కోత్రుద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మొహొల్ చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. మొహొల్పై పలు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్కు చెందిన అనుమానిత ఉగ్రవాది మొహమ్మద్ ఖతీల్ సిద్ధిఖీని యరవాడ జైలులో హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డాడు. కాగా,మొహుల్ హత్యకు భూ తగాదాల తో పాటు డబ్బులు సంబంధించిన గొడవే కారణమని పోలీసులు తెలిపారు. ఇది గ్యాంగ్వార్ కాదని, సొంత గ్యాంగ్ చేతిలోనే మొహొల్ హత్యకు గురయ్యాడని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల మెయిన్ రోడ్ ప్రక్కన బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తికి ముగ్గురు సోదరులు అయితే ఒక సోదరుడు దత్తతకు వెళ్లిపోగా ముగ్గురు అన్నదమ్ములు ఒకే గృహంలో నివసిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ కు వివాహం కాగా భార్య ఇదివరకే వదలిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ముగ్గురు అన్నదమ్ములు తల్లి తో పాటు ఉంటున్నారు. వీరికి గతంలో ఇంటి ప్రక్కనే కర్రల మిల్లు ఉండేది ప్రస్తుతం అది శిదిలం అయిపోయింది. సోమశేఖర్ కు శ్రీనివాస్ ఇద్దరి అన్నదమ్ములకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోమశేఖర్ అన్న శ్రీనివాస్ ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. కొత్తపేట డిఎస్పీ కే.వి.రమణ, గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్, స్థానిక ఎస్.ఐ జ్వాలా సాగర్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
హైదరాబాదులోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో మలుపు తిరిగింది. ఈ ఉదంతం వెనకబోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహుల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న అర్ధరాత్రి ఓ కారు ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారమిచ్చి సాహిల్తో పాటూ ముగ్గురు యువతులను అప్పగించారు. అయితే, బ్రీత్ ఎనలైజర్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాహిల్ను హోంగార్డుకు అప్పగించి డ్రంకన్ డ్రైవ్ పరీక్షకు పంపించారు. ఈ సమయంలో నిందితుడు తప్పించుకున్నాడు. అనంతరం, సాహిల్ దుబాయ్లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన సూచనతో అనుచరులు సాహిల్ను తప్పించి వారి పనిమనిషి అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట ఠాణాకు తీసుకెళ్లారు. కారు తానే నడిపినట్టు అతడితో చెప్పించడంతో కేసు నమోదైంది. అయితే, ముగ్గురు యువతులను స్టేషన్కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు కారు నడిపింది సాహిల్ అని వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును కేసులో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బారికేడ్లను ఢీకొన్న ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ప్రధాన నిందితుడని పశ్చిమ మండలం డీసీపీ తెలిపారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు పనిమనిషిని ఠాణాకు పాంపారన్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించాక అసలు విషయం బయటపడిందన్నారు.
బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దోంగలు అలజడి చేసారు. కంకటపాలెం గ్రామం పోలేరమ్మ దేవస్థానంలో రాత్రి అమ్మవారి నగలు, హుండీ అపహరణకు గురయ్యాయి. గుడిలోని ఏ సామాగ్రిని వదలకుండా మొత్తం దోచుకున్నారు దొంగలు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలుసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు పోలీసులు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జెన్కోలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఫకీర్ గడ్డ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బుర్ర కొమురయ్య చనిపోయాడు. మరణించిన కొన్ని గంటలకు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మరణించిన విషయాన్ని ఆలస్యంగా చెప్పడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జెన్కో గేటు ముందు బంధువులు నిరసన తెలుపుతున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు మండలం చింతలపల్లికి చెందిన మామిడిపెల్లి భిక్షపతి, ఎనగందుల నరేశ్ గా గుర్తించారు. ములుగు బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనం పై యూ టర్న్ తీసుకుంటుండగా ఏటూరు నాగారం వైపు వెళ్తున్న ఇసుక లారి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందగా, నరేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన నరేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీయంకి తరలించారు.






Total views : 90621