పుద్దిచ్చేరి యానాం దరియాలతిప్ప వద్ద మత్స్యకార బోట్లు దగ్ధమయ్యాయి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. బైరవపాలెంకు చెందిన మత్స్యకార బోట్ కు దరియాలతిప్ప వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడి ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో కామాడి గంగాద్రి అనే బోట్ యజమాని సజీవదహనం అయ్యాడు. మరో ఇద్దరు సురక్షింతగా బయట పడ్డారు. బోట్ రిపేర్ కావడంతో దరియాలతిప్ప వద్ద రిపేర్ చేసుకోవడానికి వచ్చినట్లు యానాం పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.