విజయవాడ, పార్టీ మారుతున్నారనే ప్రచారం పై వంగవీటి రాధా స్పందించారు. నేను టీడీపీలోనే ఉంటా, గాలి పార్టీ గాలి వార్తలను నమ్మొద్దు. కొద్దిరోజులుగా వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారం. తాజాగా ఈ ప్రచారానికి పుల్స్టాప్ పెట్టిన వంగవీటి రాధా. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన వంగవీటి రాధా. మీకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానన్న వంగవీటి రాధా.
CVr health
దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు AIపై శిక్షణ ఇచ్చేందుకు భారీ మొత్తంలో వెచ్చించడానికి సైతం వెనకాడటం లేదు. ఈ రంగంలో లక్ష మంది ఉద్యోగులకు శిక్షణను పూర్తి చేశామని వెల్లడించింది. నిన్న రిలీజ్ అయిన TCS Q2 ఫలితాల కాన్ఫరెన్స్ లో కంపెనీ CEO & MD కృతివాసన్ ఈ మేరకు ప్రకటించారు.
‘జనరేటివ్ AI అందరి దృష్టినీ ఆకర్షించింది. మా కస్టమర్ సమ్మిట్లలో ప్రతి ఒక్కరూ ఉత్పాదక AIని కీలక థీమ్గా మాట్లాడుతున్నారు. కొత్త ఉత్పత్తులు, సేవల కోసం దానిని ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో.. ప్రాజెక్ట్లను ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనే వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి’ అని TCS CEO తెలిపారు.
ఉద్యోగులు సహా కొత్త సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ COO గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు. ‘మేము ఇప్పుడు లక్ష మంది బలమైన Gen-AI రెడీ కన్సల్టెంట్స్ మరియు ప్రాంప్ట్-ఇంజనీర్లను కలిగి ఉన్నాము. వారు ఆయా సెగ్మెంట్లలోని మా క్లయింట్ల కోసం వందలాది Gen-AI ప్రాజెక్ట్లను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నారు” అని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
విశాఖ, దక్షిణ నియోజకవర్గం వైసీపీ లో కుమ్ములాట. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి మాకు వద్దంటూ కార్పొరేటర్లు ఆగ్రహం. 400 మద్యం బాటిళ్లు పంచి వైసీపీ పరువు తీసారంటున్న కార్పోరేటర్లు. MLA వాసుపల్లి గణేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కళాశాలలో మద్యం పంపకాలు పై వాసుపల్లి పై తిరగబడ్డ ycp కార్పొరేటర్లు. అవసరమైతే వైసీపీకి రాజీనామా చేస్తామంటున్న కార్పొరేటర్లు. మందు పుల్ బాటిల్స్, కేజీ కోడి మాంసం పంపిణీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్పొరేటర్లు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం. ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు కాగా క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 37వ రోజు చేరుకున్న నేపథ్యంలో మట్టి తింటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడి మహిళలు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరవదిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. అంగన్వాడి యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడి టీచర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల గట్టమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, దేవాదాయ, ఆటవి శాఖ మంత్రి కొండా సురేఖలు. మేడారం జాతర నిర్వహణ పనులను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి వద్ద నాయకపోడ్ గిరిజన పూజారులు మంత్రి సీతక్క, కొండా సురేఖ లకు ఘన స్వాగతం పలికారు. ఘట్టమ్మ తల్లికి మంత్రులు చీరే, సారె లను సమర్పంచారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రులు సీతక్క, సురేఖ లను ఆశీర్వదించారు. అనంతరం గట్టమ్మ దేవాలయం పరిసరాలను మంత్రి సీతక్క పరీశీలించారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లో దారుణం చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో భోగి పండుగ సందర్భంగా గ్రామంలోని యూత్ ఆధ్వర్యంలో మహిళలకు కోలాటం పోటీలు నిర్వహించారు. కాగా ఈ కోలాటం పోటీలలో మహిళలు కోలాట నృత్యం చేశారు. కాగా కోలాటం మధ్యలో అంతడుపుల రాజమణి (40) హఠాత్తుగా కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు, గ్రామ పెద్దలు జమ్మికుంట లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించిందని తెలిపారని గ్రామ సర్పంచ్ దాసరి భద్రయ్య తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తో కల్వల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు. తాజాగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి టీ10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో అతడు పుణే డెవిల్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. హొస్సేన్, మరో ఏడుగురు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ కు సంబంధించిన అంశాలను బుకీలతో ఫోన్ లో మాట్లాడడం, వారి నుంచి ఐఫోన్ ను గిఫ్ట్ గా పొందడం, బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయకపోవడం వంటి అభియోగాలు నిజమేనని వెల్లడైంది. దాంతో అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నాసిర్ హొస్సేన్ అంగీకరించాడు.
కృష్ణా జిల్లా,పెనమలూరులో దారుణం జరిగింది. సాయి ప్రవీణ్, మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని, రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు. ఈ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి ఆ నేరాన్ని మృదుల భర్త రిషేంద్రపై వేసేందుకు ప్రయత్నించాడు. అయితే మృతురాలి కాల్ డేటా ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు, అసలు హంతకుడైనా సాయి ప్రవీణ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు.





Total views : 91148