కరీంనగర్ లో అక్రమ భూ దందాలతో సంబంధం ఉందనే కారణం తో కార్పొరేటర్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన రాజిరెడ్డి అనే వ్యక్తి. వన్ టౌన్ పోలీసుల అదుపులో భగత్ నగర్ 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు,నిమ్మశెట్టి శ్యాం. కరీంనగర్ వన్ టౌన్ ఐపిసి 447,427 సెక్షన్ల క్రింద కేసు నమోదు.
CVr health
హనుమకొండ జిల్లా, పరకాల ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రైతుల ఆందోళన. కార్యాలయం ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్. మా పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కు ఇచ్చేది లేదన్న రైతులు. నేషనల్ హైవే అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డు పై పడుకొని నిరసన అధికారులతో వాగ్వాదం.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సంక్రాంతి సందర్బంగా జరిగిన సోదాల్లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా మీడియా సమావేశం లో మాట్లాడుతూ డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం. తనిఖీల్లో భాగంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం. ఢిల్లీ, హర్యానా నుండి దిగుమతి చేసుకోని, ఇక్కడ అమ్ముతున్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం మరియు వెండిని కూడా స్వాదీనం చేసుకున్నాం. సుమారు 90 లక్షల నాన్ డీపీఎల్ మరియు ఐడి లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నాం. కోటి 83 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు యధేచ్చగా సాగుతున్న కోడిపందాలు. అధికారులు ఇచ్చిన అనుమతులు ముగిసిన నాల్గవ రాజు కొనసాగుతున్న కోడిపందాలు. కోడిపందాల మాటల యదేచ్చగా గుండాట పేకాట జూద క్రీడలు. జిల్లాలోని భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం పెదవేగి మండలంలో బహిరంగంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వైసీపీ నేతలు. కోడిపందాల బరులపై కన్నెత్తి చూడని పోలీసు అధికారులు.
అంబేద్కర్ కోనసీమ, అమలాపురం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శెట్టిబలిజ సంఘ యువ నేత వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం, సుభాష్ తల్లి, అమలాపురం కౌన్సిలర్ వాసంశెట్టి కృష్ణకుమారి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. అనుచరులతో సంప్రదించి ఏ పార్టీలో జాయిన్ అయ్యేది వెల్లడిస్తామని ప్రకటన. స్థానిక అమలాపురం వైసీపీ నాయకత్వం వేధింపుల వలనే రాజీనామా అని ప్రకటన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసినా మంత్రి విశ్వరూప్ అభ్యంతరం తెలిపారు.
విజయవాడ, కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, మాట్లాడుతూ 5 సంవత్సరాలు నా కొడుకు జైల్లోనే ఉన్నాడు. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. కోర్ట్ కి రావడం లేదు. జగన్ సాక్ష్యం చెప్పి నా కుటుంబాన్ని ఆదుకోవాలి. జైల్ లో నా కొడుకు ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. రేపటి నుండి జైల్లోనే శ్రీను దీక్ష చేస్తున్నాడు. సుబ్బరాజు శ్రీను సోదరుడు. నా తమ్ముడు వల్ల జగన్ లబ్ది పొందాడు. నా తమ్ముడు దళితుడు అనే వివక్ష న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి. రేపు ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్షా చేస్తున్నాం. ప్రాణాలైన అర్పిస్తాం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టం. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని ఒక్కడికి ఒక న్యాయం. జగన్ కి అనేక సార్లు విన్నవించాం. జైల్ లో శ్రీను, విజయవాడ లో మేము ఆమరణ దీక్ష చేస్తున్నాం. NIA కూడా కుట్ర కోణాలు లేవని చెప్పింది. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం అయినా చెప్పండి. లేదా NOC అయినా ఇవ్వండని కోరుతున్నాం.
పల్నాడు జిల్లా, నరసరావుపేటలో కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగుని మరిచిపోవద్దని ప్రతి మనిషి ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందిని ప్రతి వ్యక్తికి మొదటి దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలి అన్నారు. మాతృ భాషను మొదట చదువుకోని తర్వాత ఇంగ్లీష్ భాష పై మక్కువ పెట్టుకోవాలి ఏదీ ప్రజలకు ఫీగా ఇవ్వకూడదు ప్రజలకు విద్యా, వైద్యం మాత్రమే ఫీగా ఇవ్వాలి అన్నారు. ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదని మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలి, శారీరకంగా దృడంగా ఉంటేనే మానసికంగా దృడంగా ఉంటారు అన్నారు. ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలి మనదేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో మరెక్కడా లేవు, ఇంట్లో వంట రూము, పూజ రూము తప్పకుండా ఉండాలి అన్నారు. ఇటీవల ప్రజలు ఫాస్టు ఫుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు అని తెలియజేశారు.
తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన గౌరీ దేవి రథోత్సవం. రథోత్సవంలో భారీగా పాల్గొన్న గ్రామ ఆడపడుచులు, మరియు గ్రామస్తులు. శ్రీరంగపట్నం పురవీధులలో కనుల పండుగ సాగిన గౌరీ దేవి అమ్మవారి రథోత్సవం. గౌరీ దేవి అమ్మవారికి నాన్చనం ప్రకారం సారిని అందజేసిన గ్రామ ఆడపడుచులు. గౌరీదేవి రథోత్సవంలో వివిధ వేషధారణలతో ప్రజలను ఆకర్షణ చేసిన వ్యాసధారణలు. అట్లతద్ది నుండి మొదలయ్యే గౌరీదేవి ఉత్సవాలు నేటితో ముగియడంతో భారీ ఊరేగింపుతో గౌరీదేవిని అత్తవారింటికి సాగనంపిన గ్రామ ఆడపడుచులు.
తమిళనాడు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని జల్లికట్టు లో ఒక బాలుడు సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని సిరవాయల్లో జల్లికట్టు పోటీ జరుగుతోంది. ఈ పోటీలను సహకార శాఖ మంత్రి కెఆర్ పెరియ కరుప్పన్ ప్రారంభించారు. ఈ పోటీలో ఆన్లైన్లో నమోదైన 271 ఎద్దులను గేటు నుండి ఒకదాని తర్వాత ఒకటి విప్పుతున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు, ఆవుల యజమానులకు బహుమతులు అందజేయనున్నారు. అంతకుముందు మంజువిరాటు ఉత్సవ సమన్వయకర్త వేలుచ్చామి ఆధ్వర్యంలో పెరియనాయకి, తేనాక్షి అమ్మన్ ఆలయంలో శమీ దర్శనం ముగించుకుని ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. అక్కడి నుంచి ఎద్దులను ఒకదానికొకటి విడిచిపెట్టి. 800 మంది వరకు పోలీసుల రక్షణలో పాల్గొంటున్నారు. పెరియకరుప్పన్, జిల్లా కలెక్టర్ ఆశా అజిత్ పోటీలను ప్రారంభించారు. బృంగటికి చెందిన భాస్కరన్ (13) అనే బాలుడు ఎద్దును పట్టుకోవడానికి వెళ్లి ఢీకొని మృతి చెందాడు. అలాగే 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు సమాచారం.
గుంటూరు, యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం లో మాట్లాడుతూ 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి జరగబోతోంది. వ్యవస్థలన్ని నాశనం చేసి, అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు. సొంత కంపనీ లో తయారు చేసిన లిక్కర్ అమ్మితే కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ మోహన్ రెడ్డి కి అధికార దాహం, దనదాహం ఉంది. రాష్ట్రంలో పేదవాడు బ్రతికే పరిస్థితి లేకుండా చేసిన జగన్. వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు. రాష్ట్రంలో రోడ్డున పడ్డ తుపాను బాధిత రైతులను ఆదుకొని పరిస్థితి. తన మేనిపేస్టులో అమరవతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్. జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా పెట్టి టీడీపీ, జనసేనపార్టీ మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. SC, ST, మైనార్టీలను ఓటు బ్యాంకు గా వాడుతున్నారు. అవినీతి పుత్రిక సాక్షి పత్రిక. పరపతి తగ్గిన యరపతినేని పార్టీ మారే అవకాశం ఉందని తప్పుడు విష ప్రచారం చేస్తోంది సాక్షి పత్రిక. వైసీపీ పార్టీ ఒక మాఫియా పార్టీ. రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. పులివెందుల పోయిన పిల్లి పరదాలు కట్టుకొని తిరుగుతుంది. గురజాల నియోజకవర్గం లో విచ్చల విడిగా ఆక్రమ మైనింగ్ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి. రాబోయే రోజుల్లో 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం జగన్ మోహన్ రెడ్డిని సమాజం నుండి వెలివేస్తారు. టీడీపీ, జనసేనపార్టీ కి చెందిన వారు రాబోయే ఎన్నికల్లో గెలుపుకు సిద్ధమయ్యారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలి.




Total views : 91203