తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల తాగుబోతు ఆగడాలు. నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి పై మాటల దాడి. రిషితా రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలు, ఏర్పడు ఇంచార్జీ కిషోర్, పంపాలి మురళి మోహన్. టీడీపీ ప్రచార రథానికి వైసీపీ ప్రచార రథం అడ్డుపెట్టి రిషితా రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు. రిషితా రెడ్డిని ప్రచారం చేసుకోకుండా వైసీపీ ప్రచార రథంలో సౌండ్ పెంచిన వైనం. ప్రచార రథం పై ఉన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఫోటో ను చించి వేసిన వైసీపీ తాగుబోతులు.
cvr live
కృష్ణాజిల్లా, మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు, ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు. నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవు. నేను ఉండేది పెనమలూరులోనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో 2024లో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరేస్తాం.
అమరావతి, నేడు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల. 9:30 నీ లకు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు రానున్న షర్మిల. షర్మిల ప్రమాణ స్వీకారానికి రానున్న ఏఐసిసి నేతలు మాణిక్యం టాగూర్, మునియప్పన్, కృష్టఫర్ తిలక్, ఎపిసిసి కీలక నేతలు,మాజీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళనున్న వైఎస్ షర్మిల. కానురులో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర రత్న భవన్ పిసిసి కార్యాలయానికి రానున్న షర్మిల. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్న షర్మిల.
విజయవాడ, కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. కోడి కత్తి శీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులు. కోడికత్తి శీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించిన పోలీసులు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీబు ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయిన నిరసనకారులు. వెంటనే స్పందించి అతని వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను విజయవాడ హాస్పటల్ తరలించిన పోలీసులు.
ఉరవకొండ, ఈనెల 23న ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి, ఎస్పీ అన్బురా జన్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణం లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. 7,876 లక్షల మంది మహిళలకు రూ.6,379 కోట్ల ఆసరా మొత్తాన్ని సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు. ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ సీఈఓ వైభోమ్ నిదియాదేవి, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, స్థానిక తహసీల్దారు శ్రీధరమూర్తి పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలువయి మండలం వెంకటరెడ్డి పల్లి జంక్షన్ వద్ద తమిళనాడు కూలీలను పట్టుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్సై రాఘవేంద్ర వారి సిబ్బంది. వెంకట రెడ్డి పల్లి హైవే 565 కూడలిలో టెంపో వాహనం లో ప్రయాణిస్తున్న 20 మంది కూలీ. వాహనం ను ఆడుకున్న అధికారులపై స్మగ్లర్లు దాడి కి యత్నం. వెంకట రెడ్డి పల్లి గ్రామస్తులు సహకారం తో స్మగ్లర్లు, కూలీలను పట్టుకొన్న పోలీసులు. వారి వద్ద గొడ్డళ్ళు, కత్తులు. ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.
కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల రూ.200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను జరిపినట్లు గుర్తించామని తెలిపిన ఈడీ.యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా కొనుగోలు చేసినట్లు, విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని తెలిపిన ఈడీ.
భారత్ గెలవకపోవడం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.ఈ ప్రపంచకప్లో అజేయంగా కొనసాగిన టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే మైదానంలో రేపు నవంబర్ 15న టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుందా?





Total views : 90731