అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీష. ఉపఎన్నికల ఆర్వో రాజకీయ భజన. గిరిషా పై ఈసి సస్పెన్షన్ వేటు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు, కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం. అప్పటి తిరుపతి ఆర్వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం. నకిలీ ఓటర్లు, ఓటరు కార్డుల జారీకి ఆర్వో లాగిన్ వాడటంపై ఈసీ ఆగ్రహం. అప్పటి తిరుపతి ఆర్వో, ఏఆర్వో, బీఆర్వోపై చర్యలకు ఈసీ ఆదేశం. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా. ఉపఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా, ఆర్వోగా ఉన్న గిరీషా. అప్పట్లో 30 వేలకు పైగా బోగస్ ఓట్లు,ఎపిక్ కార్డులు జారీ అయ్యాయని ఆరోపణలు.
cvr om
పోలిసులను నిలదీసిన సీఐటీయూ, సీపీఎం నాయకులు. పెండింగ్ లో ఉన్న జీతాల కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న శ్రీ రామి రెడ్డి తాగునీటి పథకం కార్మికుల పై R.W.S అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సీఐటీయూ నాయకులు తెలిపారు. తాము సమ్మె లో ఉండటం తో పై అధికారులతో పాటు కనేకల్ మండలం సోల్లాపురం గ్రామ సర్పంచ్ భర్త అవగాహన లేకుండా మోటార్లు అన్ చెయ్యడం తో కౌకుంట్ల గ్రామం వద్ద పైప్ లైన్ పగిలిపోయిందన్నారు, వారి పై చర్యలు తీసుకోకుండా సమ్మె లో ఉన్న తమ పై కేసులు పెట్టడం ఎంటని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న దళిత కార్మికులను చులకనగా చూసిన అధికారుల పై SC,ST కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు చెందిన 500 వందల గొర్రెలు మేత కోసం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్తున్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గూబనపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. 26 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ బండి రోడ్డు పక్కన వదిలి పరారయ్యారు. సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి మాధవయ్య తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుండి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గొర్రెలను రహదారిపై లేకుండా పక్కకు తొలగించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం. తప్పిన పెను ప్రమాదం. మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా స్థానిక ప్రాఫిట్ షూ మార్ట్ వద్దకు వచ్చేసరికి తన మారుతి – 800 కారు షార్ట్ సర్కూట్ కారణంగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. దుర్గా ప్రసాద్ కారులో నుంచి బయటపడడం తో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం. తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాద కబడి స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీ , పురుషుల జాతీయస్థాయి కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కలిసి ఆర్డీవో అంబరీష్ ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను గాల్లో విడిచిపెట్టారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించటం వల్ల ప్రతిభ కలిగిన ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కబడ్డీ వంటి గ్రామీణ క్రీడను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 30 ఏళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఈ పోటీలలో 18 రాష్ట్రాల జట్టు తలపడనున్నాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ అందించనున్నారు. ఈనెల 21న ఫైనల్స్ జరగనున్నాయి.
కరీంనగర్ లో అక్రమ భూ దందాలతో సంబంధం ఉందనే కారణం తో కార్పొరేటర్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన రాజిరెడ్డి అనే వ్యక్తి. వన్ టౌన్ పోలీసుల అదుపులో భగత్ నగర్ 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు,నిమ్మశెట్టి శ్యాం. కరీంనగర్ వన్ టౌన్ ఐపిసి 447,427 సెక్షన్ల క్రింద కేసు నమోదు.
హనుమకొండ జిల్లా, పరకాల ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రైతుల ఆందోళన. కార్యాలయం ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్. మా పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కు ఇచ్చేది లేదన్న రైతులు. నేషనల్ హైవే అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డు పై పడుకొని నిరసన అధికారులతో వాగ్వాదం.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సంక్రాంతి సందర్బంగా జరిగిన సోదాల్లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా మీడియా సమావేశం లో మాట్లాడుతూ డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం. తనిఖీల్లో భాగంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం. ఢిల్లీ, హర్యానా నుండి దిగుమతి చేసుకోని, ఇక్కడ అమ్ముతున్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం మరియు వెండిని కూడా స్వాదీనం చేసుకున్నాం. సుమారు 90 లక్షల నాన్ డీపీఎల్ మరియు ఐడి లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నాం. కోటి 83 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు యధేచ్చగా సాగుతున్న కోడిపందాలు. అధికారులు ఇచ్చిన అనుమతులు ముగిసిన నాల్గవ రాజు కొనసాగుతున్న కోడిపందాలు. కోడిపందాల మాటల యదేచ్చగా గుండాట పేకాట జూద క్రీడలు. జిల్లాలోని భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం పెదవేగి మండలంలో బహిరంగంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వైసీపీ నేతలు. కోడిపందాల బరులపై కన్నెత్తి చూడని పోలీసు అధికారులు.






Total views : 91023