కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, కోడి పందాల నిర్వహించే వారిపై కూచిపూడి పోలీసులు దాడి. చిన్నముతేవి గ్రామం నుండి అయ్యంకి గ్రామం వైపు వెళ్ళు కాలువ గట్టుపై కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు. 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కోళ్ళు, 23,200/-రూపాయల నగదు, 6 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూచిపూడి ఎస్సై సందీప్. కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
cvr om
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చోడవరం క్వారీలో ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి క్వారీలో పరిశీలనకు వెళ్లారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెసి కేసి కంపెనీ కాకుండా అక్రమంగా మరో రెండు చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది కాగా, మరొకటి వైసీపీ పార్టీకి చెందిన రెడ్డిదని స్థానికులు చెప్పారు. బోడె ప్రసాద్ రాకను గమనించిన జోగి రమేష్ అనుచరులు పరారయ్యారు వారితో పాటు పొక్లైన్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది కూడా పరారయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని బోడె ప్రసాద్ మీడియాకు తెలిపారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి వారం గడవకముందే ఇసుక దందాకు తెర లేపారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని బోడె ప్రసాద్ కోరారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవలసిన అధికారులే అండగా నిలబడటం దారుణమని ఇక్కడ అక్రమ మైనింగ్ ను నివారించే వరకు వారిని విడిచిపెట్టేది లేదని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
పిప్పి పన్నుతో బాధపడేవారు ఒక చిన్న టెక్నిక్ ద్వారా పళ్ళను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా పిప్పిపంటి బాధను చక్కగా ఇంట్లోనే తగ్గించుకునే ఔషధాల మొక్క గురించి చెప్పబోతున్నాను. ఇది మీరు ఏమి చేయాల్సిన పనేలేదు ఈ మొక్క ఆకులు మీకు దొరికితే చాలు మీ పంటి సంబంధిత సమస్యలు పరారు.. అక్టోబర్లో సీతాఫలం పండు విరివిగా లభిస్తుంది. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండు చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కేవలం పండు మాత్రమే కాదు.. సీతాఫలం ఆకులు కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. మన అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం చాలామంది చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి వ్యాధి తీవ్రత ఎక్కువుంటే మరి కొంత మందికి పింపుల్స్ రూపంలో లేదా రాసేస్ రూపంలో చిన్న చిన్న పొక్కుల రూపంలో ఉంటూ ఉంటాయి. వాటిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనికి ఎం చేయాలంటే కొన్ని సీతాఫల ఆకులను తెచ్చుకుని పసుపు ఉప్పు వేసి మెత్తగా నూరి ఆ పేస్ట్ ను మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేస్తే ఎలాంటి భయంకరమైన పుండ్లు అయినా సరే తగ్గిపోతాయి. నోటి దుర్వాసనతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ముందుగా నోటి దుర్వాసన పోవడానికి ఈ సీతాఫల ఆకులను ఒకటి రెండు తెచ్చుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసి బాగా నమలండి. అలా నమలిన తర్వాత ఆ పిప్పి తో ఒకసారి పళ్ళను బాగా రుద్దుకోండి. తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి ఊసి మరొకసారి మంచినీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజూ చేయడం వల్ల నోట్లో ఉండే క్రీములు చచ్చిపోతాయి. అలాగే పంటి గార కూడా తగ్గిపోతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మీ పళ్ళు చాలా తెల్లగా మారుతాయి. ఇక దుర్వాసన అనే సమస్య ఉండదు. ముఖ్యంగా పిప్పి పన్ను కూడా చాలా తొందరగా నయమవుతాయి. ఆ నొప్పి కూడా తగ్గుతుంది. పిప్పి పన్ను కోసం ఏం చేయాలంటే మీరు సీతాఫలం ఆకులను తెచ్చుకుని పేస్ట్ లాగా మెత్తగా నూరి ఎక్కడైతే పిప్పి పన్ను ఉందో ఆ పిప్పి పన్ను మీద ఈ పేస్టు ఉంచితే లోపల క్రిములు చచ్చిపోతాయి. పిప్పి పన్ను పెయిన్ కూడా ఆశ్చర్యంగా తగ్గిపోతుంది. అంటే ఎంత తొందరగా తగ్గిపోతుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటికి కూడా చాలా పల్లెటూర్లలో ఆకులను వివిధ వ్యాధులను తగ్గించడానికి వాడుతున్నారు. ముఖ్యంగా పంటి సంబంధిత సమస్యల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ కు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలను పరోక్షంగా విమర్శించి, హెచ్చరికలు జారీ చేశారు. నందికొట్కూరులో పక్కా నియోజకవర్గం నాయకులు రాజకీయం చేశారని అదే రాజకీయం మీ నియోజకవర్గంలో నేను చేస్తే మీకు డిపాజిట్లు రావని సిద్ధార్థ రెడ్డి హెచ్చరించారు. గత నాలుగున్నర ఏళ్లలో అధికార పార్టీలో ఉన్న దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, అటువంటి పరిస్థితులలో కూడా కార్యకర్తలను వీడలేదని అన్నారు. నియోజకవర్గంలో వైసిపి గెలుపుకు ఓట్లు అడిగింది మేము, కేసులు మోపుకుంది మేము, ఇబ్బందులు పడింది మేము అని మా నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం వారి పెత్తనం ఏందని మా ఎమ్మెల్యే వాళ్ల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడడం ఏందనీ, ఎవడో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం ఏందని ప్రశ్నించారు. టిడిపి నాయకులను పక్కన పెట్టుకొని రాజకీయం చేయడం మగతనమని సొంత పార్టీ నేతలను ఘాఢంగా విమర్శించాడు. రాబోయే ఎన్నికలలో అభివృద్ధికి ఓటేయాలంటూ గౌరు వెంకటరెడ్డి, మాండ్ర, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తోపాటు తాజా ఎమ్మెల్యే ప్రజలను అడుగుతారు, ప్రజలు వీరిని నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ టిడిపి పార్టీలోకి వెళ్ళనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. వైసీపీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని కానీ టిడిపి మేనిఫెస్టోను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం వైసిపి అభ్యర్థి డాక్టర్ సుధీర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు సుమారు 5000 నుంచి 8000 వరకు పాల్గొన్నారని వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని తెలిపారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఏపీ శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా కార్యకర్తల పరిచయ కార్యక్రమం శక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా మాట్లాడుతూ నేను నందికొట్కూరు వాసిని మీ మనిషిని ఇక నుంచి మీ కష్ట సుఖాలు తెలుసు కోవడం కోసం నన్ను జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. నేను కర్నూలు పరిసర ప్రాంతములలో డాక్టర్ గా సేవలు చేశాను అందులో మొదటగా నందికొట్కూరు కె అందించాను. నేను డాక్టర్ నుంచి రాజకీయాల్లోకి రావడానికి కారణం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అన్నారు. కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ లేదు కార్యకర్తలు లేనిదే ఏ రాజకీయం లేదన్నారు. కార్యకర్తలు ఎవరెవరు నష్టం పోయారో వారినీ కాపాడకునే బాధ్యత నాదన్నారు. కార్యకర్తలను నాగుండెకు అత్తుకుని వారి కష్ట సుఖాలను పంచుకొని మీకు తోడుగా ఉంటానన్నారు. భారతదేశం లో ఎక్కడ లేనటువంటి విధంగా స్కూల్స్ కానీ ఆరోగ్య కేంద్రాలుకానీ అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.
నంద్యాల వైసిపి లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవి పై వైసిపి జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి తిరుగుబాటు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే పనితీరు, మాటలను జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతుంది. వీడియోలోని డైలాగ్ ను గోకుల్ కృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూన్నాడు. వీడియోలోని డైలాగ్ లకు వ్యతిరేకంగా రేపు గాంధీ చౌక్ లో ధర్నాకు గోకుల్ కృష్ణారెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు.
కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి…నిద్రపోతున్న మున్సిపాలిటీ అధికారులు
వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు విడిచాడు. 20 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతిచెందాడు. కుక్క కాట్లకు గురైన ఓ చిన్నారి ఏడాది వయసులోనే కన్నుమూశాడు. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని కుక్కలు రోడ్డుపైకి లాక్కేలి మరీ చంపేశాయి. ఆ బాలుని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పటివరకూ తమతో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండడం చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ హృదయ విదారకర సంఘటన మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ కుటుంబంలో జరిగింది. సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో జీవితం సాగిస్తున్నాడు. పెద్దకుమారుడి పేరు నాగరాజు ఆ బాలుని వయస్సు ఏడాది. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నాగరాజును 20 కుక్కలు ఒకేసారి దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న సూర్యకుమార్ గానీ ఆ బాలుని తల్లిగానీ గమనించలేదు పడుకొని లేచి చూసిన సూర్య కుమార్ కు నాగరాజు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు కంగారు పడ్డారు. తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికిన ఎక్కడ కనిపించలేదు చివరకు రోడ్డుపై వచ్చి చూసేసరికి కుక్కలు లాక్కెళ్ళి చంపేసాయని గుర్తించారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో అనేకసార్లు కుక్కలు చిన్నారులపై దాడి చేసిన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు.
గంగూరు శాఖ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. గంగూరు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామం నూజి వీడు మండలం మర్రి బంధం గ్రామం, కాగా అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్ లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న పాత్రలు, బంగారం కోసం లాకరు అడిగాడు. ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని, నాకు టార్గెట్లు ఉన్నాయి అని ఆయనకు సూచించింది. దీంతో యోగేశ్వర రావు రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణా విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం పెద్ద కొండేపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షేక్ ఆశ అనే మహిళను వివాహం చేసుకోవడం జరిగింది. కొంతకాలం బాగానే జీవించిన నేపథ్యంలో వారికి ఒక బాబు పుట్టడం జరిగింది. ఇటీవల కాలంలో వారిరువురు మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడం వలన పెద్దలు సరిచేయడం జరిగిన సందర్భాలు కొనసాగాయి. అభిరామ్ అనే వ్యక్తి ఆశ అనే మహిళకు శిరోముడనం చేసి నన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ బహిరంగంగానే విమర్శించడంపై స్థానికులు జరిగిన అన్యాయానికి బాధితురాలికి న్యాయం జరగాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.





Total views : 90937