అల్లూరి జిల్లా ఏవోబీ లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టు PLGA వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడుగడుగునా అనుమానితులను సోదా చేస్తున్నారు. ప్రత్యేక దళాలతో మావోల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
cvr
చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ను పెప్పర్ మోషన్ సంస్ధ ఏర్పాటు చేయనున్నారు. పుంగనూరు ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్, జర్మనీకి చెందిన ప్రముఖ పెప్పర్ మోషన్ సంస్థ సీఈవో ఆండ్రియాస్ హేగర్, ప్రతినిధి బృందంచే మీడియా సమావేశం నిర్వహించారు. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో పెప్పర్ మోషన్ సంస్థ రెడీ కాబోతోందని జిల్లా కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. ఈ సమావేశానికి ఆర్డిఓ మనోజ్ కుమార్ రెడ్డి, ఉడా చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
Read Also..
తిరుమలలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చంద్రబాబును కలవడానికి వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. తమ నేతను కలవడానికి వస్తే ఎలా ఆపుతారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. భద్రత కారణాల రీత్యా అడ్డుకున్నామని అర్థం చేసుకోవాలంటూ పోలీసుల సర్దిచెప్పారు. ఎట్టకేలకు చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ కు పోలీసులు అనుమతినిచ్చారు.
ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. మరోవైపు ఏ పార్టీ గెలవబోతోందనే విషయంలపై పలు ఎగ్జిట్ పోల్స్ వాటి అంచనాలను వెల్లడించాయి. మరోవైపు గత తెలంగాణ ఎన్నికల సమయంలో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2018లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే అప్పట్లో వెల్లడించింది.
బీఆర్ఎస్ కు 62 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పట్లో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 88 స్థానాల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 79 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాలి.
కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజీపీ మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడమే తమ పార్టీ విధానమని అన్నారు. సామాజిక సాధికారిత పేరిట బస్సు యాత్ర చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను రద్దు చేసిన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. సబ్ ప్లాన్ను కేంద్రం రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
రుద్రాక్షలు ధరించుట వలన దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును. రుగ్మతలు నియంత్రించడానికి , ఆరోగ్య సమస్యల పరిష్కరారానికి , శరీరములో చక్రాలను సమతుల్యపరిచేందుకు , ఆరా క్లెన్సింగ్ కు వీటిని ఉపయోగిస్తారు. రుద్రాక్షను జీవితాన్ని పరిరక్షించే ఔషధం లేదాగింజగా భావిండము పరిపాటి. రుద్రాక్షలను ధరిందడము లేదా నీటిలోవేసి ఉంచడము ద్వారా వివిధ రూపాల్లో వాడి ప్రయోజనాలు పొందవచ్చును. నీళ్ళలో రుద్రక్షను వేసి ఆ నీరు తాగడము వల్ల శారీరక ఉష్ణోగ్రను సరిచేయవచ్చును. శరీరము నుండి విషతుల్యాల్ని వెలికి నెట్టవచ్చును. ఇది చర్మాన్ని కాంతివంతముగా ఉంచుతుంది. గుండె సంబంధిత రుగ్మతలను , రక్తపోటును , ఉదరసమస్యలు , తలనొప్పి , డయాబిటీస్ , రక్తహీనత , స్థూలకాయము , మబద్దకము మొదలైనవాటిని అరికట్టడములో రుద్రాక్షలు సహకరిస్తాయి.
బీట్రూట్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో లెక్కించడం చాలా కష్టం. బీట్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనలను రక్షిస్తుంది. ముఖ్యంగా దీని రసం, సలాడ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెప్పవచ్చు. తరచుగా మలబద్ధకం, కడుపు సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా బీట్రూట్ తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఇది మన శరీరానికి శక్తిని అందించడానికి పనిచేస్తుంది. మీకు అధిక రక్తపోటు ఉంటే బీట్రూట్ సలాడ్ లేదా జ్యూస్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే బీపీ అదుపులో ఉంటుంది. తరచుగా అలసట లేదా బలహీనత ఉంటే బీట్రూట్ దివ్యౌషధంగా చెప్పవచ్చు. బీట్రూట్ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. బీట్రూట్ మన అందానికి చాలా ముఖ్యమైనది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముఖంపై అద్భుతమైన గ్లో తెస్తుంది.
కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి.కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి. ఆ గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఉండేవారు. వారు పుట్టుకతో మూగ చెవుడు గుడ్డివారు. ఇన్ని వైకల్యాలున్నా చక్కగా వ్యవసాయం చేసేవారు. స్వయంగా బావి తవ్వి మోట కొట్టి సాగుచేసుకునేవారు.ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీళ్లు తగ్గాయి. దీంతో బావి మరింత తవ్వాలని నిర్ణయించుకున్నారు. తవ్వుతున్నప్పుడు ఠంగ్మనే శబ్దం వినిపించింది. పరిశీలిస్తే బావిలో పెద్ద రాయి. దానిని తొలగించడానికి గడ్డపార దెబ్బ వేయగా దాంట్లో నుంచి రక్తం పైకి ఎగిసింది. రక్తం ఆ ముగ్గురి స్నేహితులపై పడగానే వారి వైకల్యం పోయిందట. ఆ నోటా ఈ నోటా విషయం ఊరంతా తెలియడంతో బావిని మరింత లోతుకు తవ్వారు. అప్పుడు గణనాథుడి విగ్రహం బయల్పడింది. భక్తి పారవశ్యంతో ప్రజలు కొబ్బరికాయలను సమర్పించారు. వీటిలో విశేషంగా పగిలిన కొబ్బరికాయల నీటి ద్వారా ఆ ముగ్గురు సోదరులు నిలుచున్న భూమి అంతా ప్రవహించింది. అలా ఈ స్థలానికి కాణి పారడం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే కాణిపాకంగా మారింది. కులోత్తుంగ చోళుడనే రాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇక అప్పటి నుంచి బావిలోని వినాయకుడు పెరుగుతున్నాడని భక్తులు అంటున్నారు. దీనికి సాక్ష్యం వినాయకుడు ధరించిన వెండి కవచాలు సరిపోకపోవడమే. ఇప్పటికి మూడుసార్లు వెండి కవచాలు మార్చినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ఈ ఆలయం సత్యప్రమాణాలకు నెలవుగా భాసిల్లుతున్నది. వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎలాంటి వివాదాలు వచ్చినా.. నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వ నిరూపణకు ఈ క్షేత్రమే కేంద్రం అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేసే ఆనవాయితీ కొనసాగింది. ప్రతియేటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వినాయకచవితి రోజే ప్రారంభమవుతాయి. అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మాది దేవతలు వచ్చి ముద్దుల గణపతిని దర్శించుకొని వెళ్తారని భక్తుల నమ్మకం.
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ లేకుండా ఎవరూ ఉండడం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. దీనివల్ల అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. అయితే చాలామంది రాత్రిపూట స్మార్ట్ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. చార్జింగ్ ఎప్పుడైనా కొంత సమయం వరకే చేయాలి. లేదంటే ఫోన్ ఆయుష్షు తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్మార్ట్ఫోన్లలో అధిక ఛార్జింగ్ను నిరోధించే అదనపు రక్షణ చిప్లు ఉన్నాయి. ఈ చిప్స్ వల్ల బ్యాటరీ 100% ఛార్జ్ అయిన వెంటనే ఛార్జింగ్ ఆగిపోతుంది. అయితే రాత్రిపూట ఫోన్ను ఛార్జింగ్లో ఉంచినట్లయితే బ్యాటరీ 99%కి వచ్చిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఇది బ్యాటరీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫోన్ తొందరలోనే పాడవుతుంది. మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే రాత్రిపూట ఛార్జింగ్లో ఉంచవద్దు. బదులుగా దానిని 80% నుంచి 90% వరకు ఛార్జ్ చేసి ఆపై దాన్ని అన్ప్లగ్ చేయాలి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు ఫోన్ జీవితకాలం ఎక్కువ ఉంటుంది. ఫోన్ని పదే పదే ఛార్జ్ చేస్తుంటే పరికరం వేడెక్కుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్ తొలగించాలి. ఫోన్ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిపై ఎలాంటి బరువైన వస్తువు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఫోన్ని దిండు కింద పెట్టుకుని కూడా ఛార్జింగ్ పెట్టవద్దు.
శ్రీవారి దర్శించుకున్న చంద్రబాబు మాట్లాడుతూ పాద పద్మాల చెంత పుట్టి అంచెలు అంచెలుగా ఏదిగా. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు నన్ను కాపాడారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నా. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించా. మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చి దర్శనం చేసుకున్నా. భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి..తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి. ప్రజలకు సేవ చేసే శక్తీ,సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నాను. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా అని చంద్రబాబు అన్నారు.






Total views : 194813