దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు స్థానికులు. 17-18 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటరు దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది. 4500 ఏళ్ల కిందటి ఈ కృష్ణుడి గుడి లో కృష్ణ, వేణి, సావిత్రి, కొయనా, గాయత్రి నదులు సంగమిస్తాయి నమ్మకం. ఈ గుడిలోని గోముఖం నుండి వచ్చే ధార ఆ ఐదు నదులూ ప్రతిరూపమని చెబుతారు. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు. గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణా నది అతివేగంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆగ్నేయ మూల నుండి నలభై ఐదు మైళ్ళ ప్రవహించి తర్వాత దక్షిణ మహారాష్ట్ర గుండా మరో పది మైళ్ళ సాగి వాణి నదిని కలుపుకుని కృష్ణవేణి నదిగా ఖ్యాతి చెందినది. తర్వాత దక్షిణ మహారాష్ట్రలో మరో 150 మైళ్ళు ప్రవహించిన కృష్ణనది కర్ణాటకలో కలుస్తుంది. కృష్ణ, వీణ, సావిత్రి, కోయనా, గాయత్రి ఈ ఐదు నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆలయంలో గోముఖి విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూడొచ్చు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మూలంగా ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో దేవగిరి యాదవ్ రాజు సింఘండియో నిర్మించారు. తరువాత, 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరాఠా చక్రవర్తి శివాజీ మార్చారు. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు కృష్ణుడి అందమైన విగ్రహంతో అలంకరించబడింది. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు అతని అందమైన విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణం, బ్రహ్మ, విష్ణు మరియు శివుని పై సావిత్రి శాపంతో దగ్గరి సంబంధం ఉంది. అవి ఇక్కడ కోయినా, కృష్ణ, వెన్నా నదిలోకి ప్రవహిస్తాయి. అయితే వెన్నానది కొంత దూరం ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణ, వెన్న ఈ రెండు నదులు కలిసి కృష్ణవేణి నదిలా ముందుకు ప్రవహించగా, కోయినా నది మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. మహబలేశ్వరం లోని కొండమీదున్న కృష్ణవేణి ఆలయంలో గోముఖం నుంచి వెలువడే నీటిధార సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలు లోనే ఒక ఎత్తైన చోట కొండ అంచు ఉంది. ఇది ఇలా ఉంటె ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూములు లాంటి రంధ్రాలు ఉండగా, అవి ఒకదానికి ఒకటి ఆరు అడుగుల దూరంలో ఉన్నాయి. ఈ ఒక్కో రంధ్రం గుండా నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఐదు నదులు ఆలయానికి వెనుక వైపు ఉన్న కొండమీద నుండి ప్రవహిస్తూ వస్తూ, ఈ రంధ్రాల గుండా కాలువ లోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణా నది ప్రవహిస్తుంది. దీనినే పంచగంగ అని అంటారు. అక్కడి గోముఖం నుండి జాలువారే నీటి ధారను పవిత్ర జలంగా భావించి, భక్తులు తలపై చల్లుకున్నారు. అక్కడి నుంచి కొంచెం దిగువకు వెళితే ఆలయాల కేంద్రంగా పేరుగాంచిన మహాబలేశ్వరం వస్తుంది. ఆ ప్రాంతాన్ని ‘ వై ‘ అనీ, ‘వాయి’ అనీ పిలుస్తారు. వాయిస్ దొడ్డ గణపతి మహాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తుంది. మహాభారత కాలంలో విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణానికి ఆలయాల నగరంగా కూడా పేరుంది. మహాబలేశ్వర్ ఆలయం కనిపిస్తుంది. ఈ మందిరం నుంచి బయటకు రాగానే అక్కడ మనకి మహాబలేశ్వర్ ఆలయం కనిపిస్తుంది. ఇది అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలో మహాబలేశ్వర స్వామి శివలింగ విగ్రహ మూర్తి దర్శనం ఇస్తాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి పంచగంగని చూసి తరిస్తారు. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాల్లో రంగురంగుల హ్యాండీక్రాఫ్ట్స్ ను కొనుగోలు చేయవచ్చు.
devotional news
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, జాతీయ రహదారి 65 మీద గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 69 లక్షల 98వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు నుండి బస్ లో విజయవాడ వైపుకు వెళ్తున్న గుడ్లవల్లేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం. ఎటువంటి ఆధారాలు లేని నగదుగా గుర్తించి కేసు నమోదు చేసిన చిల్లకల్లు పి.ఎస్ సబ్-ఇన్స్పెక్టర్ కృష్ణబాబు.
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కీచక యోగా టీచర్ ను గురువారం గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి నర్సింగప్ప వెల్లడించారు. డిఎస్పీ మాట్లాడుతూ…. గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్ నందు ఔట్ సోర్సింగ్ పై యోగా టీచర్ గా పని చేస్తున్న అనిల్ కుమార్ రెడ్డి అదే స్కూల్లో చదివే ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి నమ్మించి బాలిక ఇంటిలోని బంగారు నగలు తెప్పించుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంట తీసుకొని పోయి శారీరకంగా అనుభవించి తిరిగి గుత్తికి తీసుకొచ్చి వదిలేసి తనకు బంగారం ఇచ్చినట్లు గాని, శారీరకంగా కలిసినట్లు గాని, ప్రేమ విషయం గానీ, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇతనిపై గతంలో 2019వ సంవత్సరంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ కేసులో నిందితుడు నిందితుడిగా ఉంటూ ఆ కేసులో కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. అయితే గత నెల 25 నుంచి బాలిక కనపడకపోవడంతో తల్లిదండ్రులు గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అనుమానంతో పాఠశాలలో పనిచేసే యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిని విచారణ చేయగా ఈ భాగోతం బయటపడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిపై IPC 366, 344, 376,406,మరియు ఫోక్సో ఆక్ట్ 5,6 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు కంచరకుంట్ల రాజు (40) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాడు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమీపాన మతి స్థిమితం కోల్పోయి కన్నతల్లిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. దీంతో పక్కింట్లో ఉండే మహిళ అడ్డుపడ గా మహిళ తల పై గొడ్డలితో నరకడంతో చుట్టుపక్కల వారు కొన ఊపిరితో ఉన్న మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజు స్థానికుల నుండి తప్పించుకొని గొడ్డలితో ఊరందరిని చంపేస్తా అంటూ పారిపోయి ఒంటరిగా ఉన్న వారి పై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి రాజు కోసం గ్రామంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒంటరిగా ఎవరు బయటకు రావద్దని గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. దీంతో తిరుమలగిరి గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై, విషాదఛాయలు అలుముకున్నాయి.
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొద్దుల సాయి అనే యువకుడు కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. యువతిని వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ కరుణాకర్ రావు ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. పాత గుంటూరు లోని బాలాజీ నగర్, 3,8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం. జనసేన కార్యకర్తలు ఆగ్రహం. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన నేతల ఆరోపణలు. దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఎంపీ కేశినేని నాని కి రాబోయే ఎన్నికల్లో సీటు లేదంటూ స్పష్టం చేసిన టీడీపీ అధిష్ఠానం. నిన్న సాయంత్రం నాని నీ కలిసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురాం, కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు. 7వ తేదీ చంద్రబాబు తిరువూరు సభకు కేశినేని నాని నీ దూరం పెట్టిన పార్టీ. తిరువూరు లో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జీ గా నియమించనున్న చంద్రబాబు.
జాతీయ రహదారి చంద్రశేఖరపురం వద్ద రోడ్డు ప్రమాదo లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు. లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కారు. కార్ నెంబర్ ఏపీ 39 EB2468. ప్రమాదంలో ఎమ్మెల్సీ పిఏ వెంకటేశ్వర్లు మృతి. ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కి డ్రైవర్ కు తీవ్ర గాయాలు. మరో వాహనంలో అపోలో ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
పల్నాడు జిల్లా, దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు రోజు సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా పారిశుద్ధ పనులు చేయించాలని చూడటంతో వారిని అడ్డుకున్న కార్మికులు. రంగ ప్రవేశం చేసిన దాచేపల్లి పోలీసులు. కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బలవంతంగా స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు, ట్రాక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్న కార్మికులు.
శిరిడీ సాయి నామం అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవడం ఒక్కటే చక్కని మార్గం. ఈ కలియుగంలో సర్వ పాపములు ప్రక్షాళన కావడానికి, భక్తి మార్గంలో పయనించి ఆ సాయినాధునిలో ఐక్యం కావడానికి, నిరంతరం మానవాళిని పట్టి పీడించే అరిషడ్వర్గముల నుండి విముక్తి కావడానికి అతి సులువైన మార్గం నామ జపం. నామ జపం చేస్తే ఇక ఏ యజ్ఞ యాగాదులు అవసరం ఉండదు. అతి సులభంగా ఆ భగవంతుని దర్శించగలము. ఎన్నో వేల జన్మలకు అపారమైన పుణ్యం చేసుకొని వుంటే తప్ప సాయిభక్తులం కాలేము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన శిరిడీ సాయికి శిష్యులం కాగలిగాము అంటే కొన్ని వేల జన్మలలో మనం చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు. కాని మాయలో పడిపోయిన మనము ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూత వలె మధ్యలోనే రాలిపోతున్నాం లేక గురువారం భక్తులు గా మిగిలిపోతున్నారు. మనకు ఆ భగవంతుడైన సాయి కేవలం గురువారం మాత్రమే గుర్తుకు రావడం నిజంగా మన దురదృష్టకరం. సాయి కేవలం కోరికలు తీర్చే యంత్రం గాని ఉపయోగించుకుంటున్నాం. సాయి భక్తులమైన మనము సాయి నుంచి కోరవలసింది భౌతికమైన ఐహిక పరమైన కోరికలు కాదు. కోరికలు కలుగని స్థిని ప్రసాదించమని. సాయి జీవితం నుండి తెల్సుకోవల్సిందే కరుణ, దయ, ప్రేమ, పరిపూర్ణమైన వైరాగ్యం, పాపభీతి కలిగి వుండడం. నిరంతరం సాయిని ధ్యానించు. నిరంతరం సాయి నామస్మరణ చేయు. నిరంతరం సాయి తో మాట్లాడు, జీవితాన్ని సాయి మయం చేసుకో.
Read Also..
Read Also..