దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను ఏకంగా 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఇదే ఐపీఎల్ చరిత్రలో ఓ ప్లేయర్ కు వెచ్చించిన అత్యధిక ధర గా నిలిచింది. కాగా ఈ రికార్డు బ్రేకింగ్ ధరను కొద్ది సేపటికే భారత మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ తిరగరాశారు. రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన పంత్ ను కొనేందుకు మొదట ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య పోటీ జరగ్గా.. 10 కోట్ల మార్కును దాటిన తర్వాత.. ఆర్సీబీ తప్పుకుంది.
అనంతరం రంగంలోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. పంత్ ను కోనేందుకు దాదాపు 20.50 కోట్ల వరకు వేలం పాడింది. అనంతరం పంజాబ్ జట్టు 20.75 కోట్లకు వేలం పాడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకునేందు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన లక్నో జట్టు పంత్ కు ఏకంగా.. 27 కోట్లకు కోనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకోవడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్, ఢిల్లీ మాజీ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు అమ్ముడు పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా కొద్ది క్షణాల క్రితం నిలిచిన శ్రేయస్ అయ్యర్ ను బీట్ చేసిన పంత్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. మొత్తానికి 27 కోట్లకు రిషబ్ పంత్ ను లక్నో జట్టు సొంతం చేసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
- నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనంనేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
- పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…
- తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి