ఎపి రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్య పడుతుందన్నారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్. అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు లో టీడీపీ నేతలు గగ్గుటూరి ఖాదర్ బాషా గగ్గుటూరి హుమయూన్ ఆధ్వర్యం బాబు సూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్ ఇరువురు హాజరయ్యారు. ర్యాలి తో పాటు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు రాబోవు ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే నేవేర్చే హమిలన్నింటిని కుడా ప్రజలకు కరపత్రాల ద్వారా చైతన్య వంతులను చేస్తూ వారి ప్రచారం కోనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి ఒక జాబు క్యాలెండర్ అన్నారు మరి నాలుగన్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్ని జాబు క్యాలెండర్లు విడుదల చేసారో యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ఎ ఒక్కరు సంతోషంగా లేరని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్ ప్రభుత్వాన్నిఎప్పుడు గద్దె దించూదామా అన్నట్టు ప్రజలు ఎదురు చుస్తున్నరన్నారు. జగన్ సామజిక బస్సు యాత్ర కేవలం సోకు మాత్రమే తప్ప ప్రజలలో మాత్రం ఎటువంటి స్పందలేదన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలన్న రాష్ట్రంలో సిఎం గా చంద్రబాబు గారు రాజంపేట ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులను కచ్చితంగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా కష్ట పడలన్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి ఓటమి భయం పుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, పార్టీ నాయకుల, కార్యకర్తలు తో పాటు మైనార్టీ నాయకుల పాల్గొన్నారు.
jagan
బాపట్ల జిల్లా కర్లపాలెం వైసీపీలో గందరగోళ వాతావరణం నెలకొంది. వైసీపీకి గుడ్ బాయ్ చెప్పి కర్లపాలెం మైనార్టీ సోదరులు టిడిపి పార్టీలో చేరుతున్నారు. వీరిని తమ పార్టీలోకి టీడీపీ నాయకుడు నరేంద్ర వర్మ సాదరంగా ఆహ్వానించారు. బాపట్ల లో టిడిపి అధినాయకుడి ఆశీస్సుల కోసం నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్ మహాసేయులు బారులు తీరుతున్నారు. నాడు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు నియోజకవర్గంలోని దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు తండోపతండాలుగా తరలివచ్చారు. నేడు క్రిస్మస్ పర్వదినాన వైసీపీని వీడి అచంచలమైన విశ్వాసంతో కర్లపాలెం కు చెందిన 200 మంది మైనారిటీ సోదర సోదరీమణులు నరేంద్ర వర్మ చెంత చేరారు. రోజురోజుకు నరేంద్ర వర్మ కు పెరుగుతున్న మద్దతు, సర్వమత ప్రజల ఆదరాభిమానాలు, పార్టీ అధినాయకుడి భవిష్యత్తుకు గ్యారెంటీ తమకు ప్రేరణ కలిగించి నేడు వైసీపీని వీడి టిడిపి పార్టీలో చేరామని మైనారిటీ సోదర సోదరీమణులు ముక్తకంఠంతో తెలిపారు. నాడు ఒక్క ఛాన్స్ అని జగన్ కు ఓటేస్తే నట్టేట ముంచేసాడని నేడు వైసిపి పాపం పండిందని ప్రజలలో అసహనం పెరిగి విసిగి వేసారి పోయారని అందరి చూపు టిడిపి వైపేనని నరేంద్ర వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
22వ నంది నాటకోత్సవాలను గుంటూరులో ప్రారంభించామన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అంతరిస్తున్న ప్రాచీన కళలపరిరక్షణ కోసం ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం పుట్టినరోజు సందర్భంగా ఈ కళాప్రాంగణానికి బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. మొదటిసారి గా కళాకారులకు ఏసీ గదుల్లో వసతి ఏర్పాటు చేశామన్నారు. నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు జగన్ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. 29వ తేదీన ప్రతిభ కనపరచిన వారికి అవార్డులు పంపిణీ చేస్తామన్నారు. నంది నాటకోత్సవాలు 27మంది న్యాయనిర్ణేతలుగా కార్యక్రమం పర్యవేక్షణ చేస్తారన్నారు సినీ దర్శకుడు పోసాని కృష్ణమురళి. నిష్పాక్షికంగా అర్హులైన కళాకారులను సెలెక్ట్ చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉన్నంత కాలం ఎవరైతే అర్హుడు ఉన్నారో వారే నంది తీసుకు వెళతారన్నారు.
Read Also..
Read Also..
బాపట్ల జిల్లాలో 12వ రోజు అంగన్వాడీలు నిరసన చేశారు. బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో బస్సులు, కార్లు తుడుస్తూ భిక్షాటన చేశారు. కార్లు, బస్సులు తుడిచి భిక్షాటన చేసిన డబ్బులను సీఎం జగన్ కి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే వాటితోనైనా అంగన్వాడీల జీతాలు పెంచాలని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇటీవల కాలంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ మాట్లాడిన మాటలు కూడా తమకు ఎంతో బాధ కలిగించాయని వారన్నారు. ఒక స్త్రీ అయి ఉండి కూడా సాటి స్త్రీల పట్ల ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరమన్నారు.
అంగన్వాడి టీచర్లు, వర్కర్లు సమ్మె కొనసాగిస్తూ ఈరోజు కోరుకొండ ప్రాజెక్టు సంబంధించిన కోరుకొండ గోకవరం, సీతానగరం మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్లు, వర్కర్లు వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ జగన్ గారు గతంలో పాదయాత్ర సందర్భంగా అంగన్వాడి టీచర్లకు, వర్కర్లకు సంబంధించిన మా యొక్క న్యాయమైన డిమాండ్లను కచ్చితంగా పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమందికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మా అంగన్వాడి టీచర్లు వర్కర్ల విషయానికి వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు జగన్ గారు చిన్న సూపు చూస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించడం జగన్ గారికి చాలా చిన్న విషయం అయినప్పటికీ జగన్ గారు మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో చొరవ తీసుకుని మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం అని అంగన్వాడి టీచర్లు తమ ఆవేదన వ్యక్తపరిచారు.
ప్రతి పెదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 13.90 ఏకరాలలో అర్హులైన 415 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రతి లబ్దిదారునికి ఈ రోజు పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ టీడీపీ వారు ఏమి చేయకున్నా ప్రభుత్వం పై తప్పుడు నిందలు వేస్తున్నారని, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో గుర్తించలన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలబడాలని తెలిపారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెమీక్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిధిగా సీఎం శ్రీ వైయస్.జగన్ హాజరయ్యారు. అలాగే ఈ సెమీక్రిస్మస్ వేడుకలకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవ మతపెద్దలతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ కేక్ కట్ చేసారు.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ మాట్లాడుతూ…
క్రిస్మస్ వస్తున్న శుభసందర్భంలో ఈ సాయంత్రం పూట అడ్వాన్స్గా క్రిస్మస్ను జరుపుకుంటున్నాము. ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే కాకుండా మొత్తం తెలుగురాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్నగా, తమ్ముడిగా మెర్రీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రెవరెండ్ రాజారావు గారు మాట్లాడుతూ సుదీర్ఘంగా దేవుని గురించి సందేశం ఇచ్చారు. దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒక్కటే ఒక్క విషయం… మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం. ఆకాశమంత సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం… ఇవన్నీ కష్టమైన విషయాలు అయినప్పటికీ ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఎప్పుడైతే వాటిని మనసారా పాటించాలని తాపత్రయపడతామో… అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా ఉంటాం. దేవుడు ఆ మనసు మనందరికీ ఇవ్వాలని, రాష్ట్రాన్ని, ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నవారితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ మరోక్కసారి మెర్రీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నారు.
సీఎం జగన్ కు ఓటేసి గెలిపిస్తే తమను బిక్షం ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చారని అంగన్వాడిలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి మహిళలు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఈరోజు అంగన్వాడి మహిళలు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో సుమారు లక్షా ఎనిమిది వేలు అంగన్వాడి కుటుంబాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటుతోనే బుద్ధి చెబుతామంటూ వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఏపీ సీఎం జగన్పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే.. ఏపీలో జగన్ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజానీకానికి భాజపా వ్యతిరేకంగా ఉందని.. అయితే, ఆ పార్టీకి అనుకూలంగా జగన్ ఉన్నారని మండిపడ్డారు. ఏపీలోనూ అధికార మార్పిడి ఖాయమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీచేస్తామని నారాయణ ప్రకటించారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతల బరితెగింపు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూములు ఆక్రమిస్తున్న వైసీపీ నాయకులు. చర్చి భూమిని కాజేసేందుకు యత్నం అడ్డుపడ్డ సంఘస్తుల పై దాడి. రెండు కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వైసిపి నాయకులు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి లూధరన్ చర్చి కి సంబంధించిన 2 ఎకరాల70 సెంట్ల భూమి ని వైసీపీ నేత దాచేపల్లి నగర పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ అంజమ్మ భర్త వేల్పుల ధర్మదేవ్, అతని అన్న కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి వేల్పుల కిషోర్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసారు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలం లోకి jcb తో అక్రమించగా చర్చి సంఘ పెద్దల ఇదేమిటి ఇది బ్రిటీష్ వారు మా చర్చికి ఇచ్చారు ఇది మా సంఘం కి సంబంధించిన స్థలం మీరెవరూ అని ప్రస్నించగా ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి కిషోర్ సంఘ పెద్దల పై దాడి చేసి బలంగా కడుపులో పిడికిలితో గుద్దడంతో సంఘ పెద్దలు అందరూ కలసి దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసేందుకు వెళ్లారు కాని పోలీసులు కూడా మీరు ఎందుకు వెళ్లారు మీకు ఏమి సంబందం అని వైసీపీ నేతలకు వత్తాసు పలికారు సదరు విషయం పై సోమవారం జిల్లా కలెక్టర్ కి,యస్పీ కి స్పందనాలో పిర్యాదు చేయాలని సంఘస్తులు నిర్ణయం తీసుకున్నారు.





Total views : 90570