కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి కేంద్రమైన తుగ్గలి లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అఖిలపక్ష పార్టీ నాయకులు తాళాలు వేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోతే ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడితో ఆగదు అని అఖిలపక్ష పార్టీలతో కలిసి ఆర్డిఓ ఆఫీస్ కూడా తాళాలు వేస్తామన్నారు. అదే విధంగా కలెక్టర్ ఆఫీసు కూడా ముట్టడి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సిపిఎం, సిపిఐ, జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Janasena
మాజీమంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాo విలేకర్ల సమావేశంలో యువగళం నవశకం అనంతరం వైఎస్సార్సీపీ బెంబేలెత్తి పోయింది. దాదాపు 5లక్షల మంది హాజరైన నవకశం సభ, ప్రజలు ఏరకంగా వైఎస్సార్సీపీ పట్ల విముఖతతో ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఒకచోట పనికిరానటువంటి వ్యక్తిని మరొక చోట తీసుకెళ్లి పెట్టిన ఏరకంగా ఆ వ్యక్తి చెల్లుబాటు అవుతారనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది. ఈ యువగళం పాదయాత్ర ఇదేమీ ముగింపు కాదు ఇది ఒక నవశకానికి ఆరంభం. చంద్రబాబు చెప్పినట్లుగా జనసేన పొత్తు రేపటి ఆంధ్ర భవిష్యత్తుకు అత్యంత అవసరం. రెండూ పార్టీలు ప్రజా ప్రయోజనాల కోసo పొత్తుతో వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమయ్యింది. రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి రేపటి ఎన్నికల్లో 165 స్థానాల్లో ఎమ్మెల్యేల గెలుపు, 25 ఎంపీల గెలుపు ఈ గెలుపు రేపటి ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది, జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యం అనేక రకాలుగా చట్టాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఇవన్నీ తొలగిపోతాయి. అరాచక ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించటo టీడిపి, జనసేన ల లక్ష్యం, పొత్తు యొక్క ఉద్దేశ్యం. రేపు జరుగబోయే ఎన్నికలు జగన్మోహన్రెడ్డికి ఆంధ్రులు ఐదున్నర కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆత్మగౌరవం మధ్య జరిగే యుద్ధమిది, జగన్మోహన్రెడ్డి అవమానించి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ప్రజా ఆస్తుల్ని దోచుకుంటున్న తరుణంలో రేపు ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఓటు వేస్తారనేది సందేహం లేదు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్రెడ్డి కి బైబై చెప్పటానికి సమాయాత్తమయారు.
వైసిపి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన దాడులు నిర్వహించిన పారిపోమని టిడిపి ఓట్లను తొలగించడం, ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పల్నాటి ప్రజలు టిడిపి పార్టీని ఆదరించారని ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి టిడిపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టండని నష్టపడ్డ ప్రజలకు, ప్రతి టిడిపి కార్యకర్తకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఓటమి భయం వైసిపి పార్టీని వెంటాడుతుందని వ్యవస్థలను వెంటబెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమని ప్రజలు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిన కూడా లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగిందని అది జీర్ణించుకోలేని వైసిపి ప్రభుత్వం వారు పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుండి ఎద్దేవా చేస్తూనే ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తమ ఓటు హక్కుతో వైసిపి ప్రభుత్వంకు ఓటమిని 70mm లో సినిమా చూపిస్తారని ఆయన అన్నారు.
నారా లోకేష్ది అట్టర్ ప్లాప్ యాత్ర అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర చేశారు. యువగళం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని పేర్ని నాని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ అట్టర్ ప్లాప్ సినిమా. అది పాదయాత్ర కాదు జంపింగ్ జపాంగ్ యాత్ర. లోకేష్ యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే ఆపలేదు. కానీ, చంద్రబాబు జైలుకు వెళ్తే మాత్రం యాత్రను ఆపేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడు. యువగళం యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టారు. రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్ బయటకు వస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశం జిల్లా దర్శి లో జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ అంగనవాడి కార్యకర్తల దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు. వారి యొక్క డిమాండ్లను వెంటనే అంగీరించి కనీస వేతనం ఇవ్వాలని తెలిపారు. తదుపరి క్రిస్ మస్ సందర్భంగా pgn కాంప్లెక్స్ లో దర్శి నియోజకవర్గం క్రైస్తవ సోదరీ సోదరులకు సుమారు 1200 మందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గరికపాటి వెంకట్ మాట్లాడుతూ దర్శి అద్దంకి రోడ్డులోనీ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఈనెల 24 వ తారీఖున దర్శిలో జనసేన ఆద్వర్యం లో సెమీ క్రిస్ మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ పాస్టర్లు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న నియోజకవర్గం రామచంద్రపురం. గతంలో ఈ నియోజకవర్గానికి రెండు వర్గాలు ప్రాతినిధ్యం వహించేవి. ఇప్పుడు సీను మారింది. ఎవరికి వారే యమునా తీరేగా మారిపోయారు. గతంలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రత్యర్థులుగా ఉండి పోటీపడేవారు. ఒకసారి తోట నెగ్గితే మరోసారి బోసు నెగ్గె వారు. వైసిపి ఏర్పడ్డ అనంతరం కూడా వీరిద్దరి మధ్య వివాదాలు, పోటీలు జరిగాయి. అనంతర పరిణామాల్లో అనూహ్యంగా తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. దీంతో బద్ధ శత్రువులైన బోస్, త్రిమూర్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. త్రిమూర్తులు టిడిపిలో ఉన్నప్పుడు బోసు భార్యపై ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నట్లు కేసు పెట్టారు. ఎస్ ఎస్ టి కేసులు కూడా బోస్ కుటుంభం పై పెట్టించారు. అదే విధంగా త్రిమూర్తులు తన పార్టీలో చేరినప్పటికీ ఆయన తనకు ప్రత్యర్థి అని బోసు బహిరంగంగా వాదించారు. వీరిద్దరినీ కాదని వైసిపి అధినేత జగన్ రామచంద్రపురం టికెట్ 2019 ఎన్నికల్లో కోనసీమకు చెందిన చెల్లుబోయిన వేణుకు ఇచ్చారు. ఆయన విజయం సాధించారు. మంత్రి అయ్యారు. దీంతో మంత్రి వేణు అటు బోస్, ఇటు త్రిమూర్తులకు చెక్ పెట్టారు. తన పవర్ పెంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బోసు కుమారుడు రామచంద్రపురం టికెట్ తనదేనంటూ వైసీపీలో ప్రత్యేక కుంపటి పెట్టారు. దీనితో వేణు, బోసు మధ్య ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొక ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. తోట త్రిమూర్తులు టిడిపిని వదిలేసిన తర్వాత చాలాకాలం ఆ పార్టీకి ఇంచార్జి లేరు. దీంతో కోనసీమ జిల్లాకి చెందిన శాసనమండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను తీసుకొచ్చి ఇంచార్జిగా నియమించారు. కొంతకాలం ఆయన అసమ్మతి లేకుండా నెట్టుకు వచ్చారు. ప్రస్తుతం టిడిపి ఇన్చార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం వై సి పి కి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి వేణు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. పైగా వీరు ఇరువురు మంచి స్నేహితులు. వీరు ఇరువురు కాంగ్రెస్ లో కలిసి పనిచేసినప్పుడు కాంట్రాక్ట్ లు కూడా చేశారు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగేవి. ఈ నేపథ్యంలో రెడ్డి సుబ్రమణ్యంకు టిడిపి టికెట్ ఇస్తే తాము పని చేయమంటూ శెట్టిబలిజ సామాజిక వర్గం కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది. మరోపక్క జనసేన ఈ సీటు పై కన్నేసింది. ప్రస్తుతం రామచంద్రపురం ఇన్చార్జిగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ కు పార్టీలోనూ ప్రజల్లోనూ పెద్దగా ఆదరణ లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యాపారవేత్త చిక్కాల దొరబాబును జనసేనలోకి తీసుకువచ్చారు. రామచంద్రపురాన్ని పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. శెట్టిబలిజ సామాజి వర్గానికి టికెట్ ఇస్తే ముమ్మిడివరానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి ఇస్తే కొత్తగా చేరిన చిక్కాల దొరబాబుకు టిక్కెట్టు ఖరారు అని చెప్తున్నారు. అయితే పితాని వద్ద ఆర్థిక బలం లేదు. ఈ రెండు దొరబాబు వద్ద ఉన్నాయి. దీంతో రెడ్డి సుబ్రహ్మణ్యానికి, ఆయన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టేందుకు ఈ టిక్కెట్టు జనసేనకు వదిలేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే దొరబాబు జనసేన తరపు అభ్యర్థి అవుతారు. బోస్ లేదా ఆయన తనయుడు వైసిపి నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి వేణును రాజమండ్రి ఎంపీ లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా పంపిస్తారని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బోస్ లేదా ఆయన తనయుడును బలంగా ఢీకొనే సత్తా జనసేనకు దక్కుతుంది. మరోపక్క రెండు పార్టీల్లో ఉంటూ స్నేహితులుగా లాలూచీ రాజకీయాలు చేస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం, వేణులకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై చర్చలు జరుగుతున్నాయి.
అన్నమయ్య జిల్లా… రాయచోటి… ఎపిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు విసుగుపొయ్యారని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చుస్తున్నారన్నారు రాజంపేట జనసేన నాయకులు మల్లిశెట్టి రమణ. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన జనబాటను, పవనన్న ప్రజాబాట ప్రచారా కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగిందన్నారు. అందులో బాగంగా మంగళవారం వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో జనసేన నాయకుల, కార్యకర్తలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల నాయకత్వం ఎంతో అవసరం అని రానున్న ఎన్నికలలో జనసేన, తెదాపా పార్టీల అభ్యర్ధులను ఆదరించాలంటూ తెదాపా, జనసేన ఆశయాలను ఇంటింటికి కరపత్రాలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వైసిపి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగన్నర ఏండ్లు అవుతున్నప్పటికీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విపలం అయ్యిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి ప్రతి మనిషికి లక్షల్లో తలభారం మోపరన్నారు. రానున్న ఎన్నికలలో వైసిపి ప్రభుత్బం డబ్బులతో ఓట్లు కొనేందుకు సిద్దపడుతుందన్నారు. ఎపి లో పెట్టుబడులు పెట్టేందుకు కుడా ముందుకు రాని దుస్థితి నెలకొందన్నారు. ప్రజలు జనసేన, తెలుగుదేశం పార్టీ కి నీరాజనం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా తెలుగుదేశం, జనసేన పార్టి తరపున ఎవ్వరికి కేటాయించిన కలిసి పని చేసి తిరతామన్నారు. వారి వెంట జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… 175 నియోజకవర్గాలలో క్యాండెట్లు లేకుండా వైసిపి నుంచి ఎవరు బయటకు వస్తారా అని టిడిపి, జనసేన గోతి కాడ నక్కల వేచి చూస్తున్నారని ఆరోపించారు. ప్రతి రోజు గడప గడపకి వెళ్తూ.. పల్లె నిద్ర చేస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో ముందు ఉన్నాను అన్నారు. పచ్చ మీడియా దిగజారుగు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నగరిలో సీటు రోజాకు లేకుంటే.. రాధాకృష్ణ నిల్చుంటాడు.. రామోజీ రావు నిల్చుంటాడా అంటూ ఎద్దేవా చేశారు. మాలో మేము కొట్టుకొని సీటు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఆ అభ్యర్థులను టిడిపికి మళ్లించేద్దాం అని గోతికాడ గుంట నక్కల వ్యవహరిస్తున్నారని, జగన్ అన్న పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో.. అంతకు మూడింతల్లు పార్టీలో మా అందరికి ఉందని, ప్రజల వద్ద జగన్ అన్నకు వ్యతిరేకత లేదని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి 100% పనిచేస్తాం అన్నారు. మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థించా అన్నారు. ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని,
చంద్రబాబు., పవన్ కళ్యాణ్ లు ఒక్క చోట నిలబడటానికి భయపడుతున్నారని అన్నారు. అందుబాటులో ఉన్నా కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యాం అని అన్నారు. 175కి 175 పక్కాగా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. నగరిలో ఎవరికి ఇచ్చిన నేను జగన్ అన్నకు ప్రాణం ఇస్తా అన్నారు. నాకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం శునకానందమే అని అన్నారు.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుసృత్తవ్యాఖ్యలు చేసిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ,దత్త పుత్రుడుకు బుద్ధిచెప్పతారు. సుబ్రహ్మణ్యేర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు ప్రారంభించిన
మంత్రి,కోట్టు సత్యనారాయణ. మెపిదేవి దేవి లో కోలువైయిన్న శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి అంగరంగవైభవంగా ప్రారంభయిన్నాయి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కోటి సత్యనారాయణకుంటబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ,స్వామిపుట్టలో పాలుపోసి, అనతరం ప్రతేకపూజలు నిర్వహించారు. తొలియత దేవాలయం అధికారులు, అర్చకులు బృందం అలయమర్యదులతో స్వాగతం పలికారు. అనతరం మంత్రి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై త్రీవరస్థాయిలో మండిపడ్డారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని ఓ భవనంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని పార్టీ నాయకులు ముత్యాల కిషోర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కలిసి ప్రారంభించడం జరిగింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి, నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఈ నూతన కార్యాలయం ప్రారంభించడం రైల్వే కోడూరు మండల కార్యకర్తలకు, నాయకులకు మంచి శుభ సూచికమని రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాటే శిరోధరంగా భావించి ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు, దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.






Total views : 91022