కృష్ణా జిల్లా అవనిగడ్డనియోజకవర్గం. అవనిగడ్డ కేంద్రం గా నిరుద్యోగులు, తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన. డీఎస్సీ పోస్టులు విడుదల చేయాలని రాస్తారోకో(ఉపాధ్యాయులు ఉద్యోగాలు) భారీ గా నిరుద్యోగులు రోడ్డుపై వచ్చి,డిఎస్పీ పోస్ట్ భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయాలి. నిరుద్యోగులకు పూర్తిగా మద్దతు పలికిన, ప్రతిపక్ష పార్టీ,టిడిపి జనసేన. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ధర్నా లు ,రాస్తారోకో అనుమతులు లేవుంటూ ఆంక్షలు విధించిన పోలీసులు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టిన నిరుద్యోగులు. ధర్నా వద్దకు భారీ గా పోలీసు యంత్రాంగం
Janasena
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గం తేటగుంట వద్ద చారిత్రాత్మక 3వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. 3వేల కి.మీలు అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తునిలో యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. ఈ మజిలీకి గుర్తుగా… వైసీపీ సర్కారు మూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈనెల 20వ తేదీన విశాఖపట్నంలో జరగనుంది. భోగాపురం ఎయిర్ పోర్టు సమీపాన గల పోలేపల్లిలో విజయోత్సవ సభ నిర్వహణ కోసం పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది. నిర్వహణ కమిటీ బాధ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి యువగళం విజయోత్సవసభను జయప్రదం చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. యువగళం ముగింపు సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున, సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం వివిధ కమిటీలను ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించింది.
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను, ఇతర జనసేన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్నా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమమని మనోహర్ చెప్పారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.
శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అరెస్టు అప్రజాస్వామికమని, ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా? శ్రీ మనోహర్ గారితోపాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తా… పోరాడతా అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు మా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటి? ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి? ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని శ్రీ మనోహర్ గారి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నానని అన్నారు. శ్రీ మనోహర్ గారిని, ఇతర నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాడతానని ఆయన అన్నారు.
శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ప్రజలను కలవడానికి వెళ్తున్న జనసేన నాయకులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. శ్రీకాళహస్తి వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడప కి వచ్చి ఇళ్లు ఇచ్చామని బుక్ ఇచ్చాడు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఇళ్లు ఎక్కడో చూపించమని వెళ్తే లోపలకి కూడా రానివ్వలేదని, ప్రజలు తమ దృష్టి కి తీసుకొచ్చారని, ఇళ్ళ పట్టాలు ఒక మోసం, దగా అని శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడులో జనసేన ఇంఛార్జి కోట వినుత ఆరోపించారు. ఇదే విషయం పై గడప గడపకు వెళ్తే మహిళలు ఖంగుతినే నిజాలు చెప్పారని వారు అన్నారు. రాబోయే రోజులలో టిడిపి జనసేన పొత్తులో భాగంగా తమ నాయకులను గెలిపించుకుంటే అందరికీ న్యాయం చేస్తామని కోట వినుత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రాజకీయాలపైన వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన కూటమి కేవలం ఎనిమిది స్థానాల్లో గెలిచిందనీ,ఎనిమిది చోట్లా బీజేపీయే విజయం సాదించిందని అన్నారు. జనసేన పోటీ చేసిన ఎనిమిది చోట్ల ఒక్కసీటు గెలవలేదనీ ఎద్దెవా చేసారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలంగాణలో చూశామనీ, ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు పవన్ కల్యాణ్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే టీడీపీ వాళ్లు ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారని, గెలిస్తే తమ వారు అని, ఓడితే కాదని అనడం టీడీపీకి అలవాటే అన్నారు.
Read Also..
Read Also..
జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించే సినీ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంపై సెటైర్లు వేశాడు. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్గా ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆర్యభట్ట గణితశాస్ర్తంలో సున్నాని ఆవిష్కరించాడు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన విఫలమైన నేపథ్యంలో రామ్గోపాల్ వర్మ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. బీజేపీతో పొత్తుపెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. కూకట్పల్లి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్కు మాత్రమే చెప్పుకోదగ్గట్టుగా సుమారు 40 వేల ఓట్లు పడ్డాయి. మిగతా ఏడు చోట్ల అభ్యర్థులకు పెద్దగా ఓట్లు పడలేదు. కూకట్పల్లితోపాటు ఖమ్మం, నాగర్కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాండూరు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. పవన్ కల్యాణ్తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా పెద్దగా ఓట్లు పడలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్సీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్గోపాల్ వర్మ కూడా ఇదే తరహాలో స్పందించాడు.
Read Also..
Read Also..
జగన్ కి ఓటు వేస్తే నడి రోడ్డుకు తెచ్చేశాడు. జగనన్న ఇళ్లు అని మోసం చేశాడు. తుఫానులో ఇళ్లు అన్ని కొట్టుకుని పోయాయి. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు. శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లో పెట్టిన తుఫాను బాధితులు జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారితో ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి వినుత కోటా, వీరమహిళలు, జనసైనికులతో 2,000 మంది తుఫాను బాధితులకు బోజన ఏర్పాట్లు చేసారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది. బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా , అశ్వారావుపేట స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. వీరికోసం పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రచారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూకట్పల్లిలో ప్రచారం చేశారు. అయినప్పటికీ అందరూ ఓటమి పాలయ్యారు. అంతేకాదు, ఏ ఒక్కరూ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. కూకట్పల్లి నుంచి పోటీచేసిన ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ ఒక్కరే 39,830 ఓట్లు సంపాదించుకోగలిగారు. మిగతా వారందరూ 5 వేల లోపు ఓట్లకు పరిమితమయ్యారు. తాండూరులో జనసేన అభ్యర్థికి 4,087 ఓట్లు పోలవగా, కోదాడలో 2,151, నాగర్కర్నూలులో 1,955, ఖమ్మం 3,053, వైరా 2,712, వైరా 2,712, కొత్తగూడెం1,945, అశ్వారావుపేట అభ్యర్థికి 2,281 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటి కీలక నేతలు కూడా డిపాజిట్ కోల్పోయారు. సీపీఎం తొలుత కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా పొత్తు చర్చలు ఫలించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి పాలైంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కిందిస్థాయి సిబ్బంది విఫలమయ్యారు. శ్రీకాళహస్తి జగనన్న కాలనీలో పర్వీన్ అనే మైనారిటీ కి చెందిన మహిళ ఇబ్బందుల్లో ఉన్నానని తెలపడంతో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా వెంటనే జనసైనికులను పంపి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. శ్రీకాళహస్తి లో పునరావాస కేంద్రాలు లేవు, ప్రభుత్వం నుండి పట్టించుకునే నాథుడు లేడు అని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఒక్క బటన్ నొక్కి తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేసారు. పునరావస కేంద్రం కి తరలించిన వారికి జనసేన నాయకులు బోజన, వసతి ఏర్పాట్లు చేసారు. జనసేన నాయకులకు కార్యకర్తలను తుఫాను బాధితులు అభినందించారు.




Total views : 90427