ఏపీ యువతకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఉద్యోగాల పండుగ ప్రకటించింది. మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ క్యాలెండర్లో ప్రభుత్వ విభాగాల్లో 10,060 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల తేదీలు, భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యలు తెలియజేశారు. సిలబస్ ముందస్తుగా ప్రకటిస్తామని.. నిర్దేశిత సమయాల్లో పరీక్షలు నిర్వహించి అన్ని పోస్టులు భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా అలర్ట్లు పొందవచ్చని కూడా చెప్పారు. ప్రతి ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగగా కొనసాగుతుందని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.
Tag:
#jobsnotification
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు.. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా కేసీఆర్ భర్తీ చేయలేదన్నారు అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్ర్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
- ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 141764