ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో కూకట్ పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ తో కలిసి డివిజన్ లోని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈరోజు డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని హోటల్ నుండి ప్రారంభమై ఎస్సీ బస్తి, మాల బస్తీ, అంజయ్య నగర్, హాస్మత్ పెట్టు, మల్లికార్జున నగర్ కాలనీ, వివిధ బస్తిలలో వేలాదిమంది కార్యకర్తల నడుమ ఎన్నికల ప్రచారం చేపట్టారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని పాదయాత్ర చేపట్టారు. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, మరి అదే విధంగా కూకట్పల్లి నియోజకవర్గం లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లు నీ కోరారు. నియోజకవర్గంలో పాటు ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ ను కూడా ఇంకా అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
Kcr
పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే…. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు బన్సీలాల్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించాయి అని పేదల కష్టాలు తెలిసిన పెద్ద మనసున్న మారాజు KCR అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా న్యాయబద్ధంగా పేదలకు అందించారని నగరంలో ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు త్రాగునీరు ఉచితంగా అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేద, మధ్య తరగతి ప్రజలకు BRS ప్రభుత్వం లో ఎంతో మేలు జరిగింది అని
BRS తోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా మాట్లాడారు కారు గుర్తుకే ఓటు వేసి హ్యాట్రిక్ బరిలో తనను నిలబెట్టాలని ప్రజలను కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Read Also..
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి. సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆ పార్టీలు తెర ముందు విమర్శలు, తెర వెనక ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. మధ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పిచ్చోళ్లని అన్నారు. కేసీఆర్ సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిందని ఆరోపించారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు విజయశాంతి. తన రాష్ట్రమే తనకు ముఖ్యమని అనుకోని రాజకీయాల్లో ఉన్నానని అన్నారు విజయశాంతి. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా తెలంగాణకు వచ్చినప్పుడు విమర్శలు చేయడం వదిలేయడం ఇదో తంతుగా మారిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన విజయశాంతి కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందన్నారు. కాంగ్రెస్ లో తన పాత మిత్రులను కలుసుకోవడం అనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ను గద్దెదించే పార్టీతోనే తాను నడుస్తానన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికార మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి డివిజన్, కాసిపేట్ టు ఇంక్లిన్ బుగర్భ గని మైన్ పైన ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ గేట్ మీటింగ్ లో టిబిజికెఎస్ యూనియన్ అధ్యక్షులు బి. వెంకట్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పాల్గొన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరూ కేసీఆర్ వెంట నడిచారు. తెలంగాణ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము.
తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులకు ఆదాయపు మినహాయించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రం పెడచెవిన పెట్టింది.
సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతం పైన పెర్క్ టాక్స్ ను ( గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలపై వేసేది ) కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా సింగరేణిలో కూడా యాజమాన్యమే కార్మికులకు చెల్లించేలా చేస్తామని మొన్న మందమర్రిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సింగరేణి క్వార్టర్లను కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఇస్తాం. 32% లాభాలను, స్పెషల్ ఇంక్రిమెంట్లను, సుమారు 17వేల డిపెండెంట్ ఉద్యోగాలు కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చామని తెలిపారు. ఇన్నేళ్లుగా కనబడని వివేక్ ఎన్నికలు రాగానే ఓట్ల కోసం కార్మికులపై దొంగ ప్రేమ చూపిస్తున్నాడు.
కార్మికులు సంఘాల పేరు మీద ఆగం కావొద్దు, తొందరపడొద్దు. కోట్ల డబ్బులతో కార్మికులను మోసం చేయాలని వివేక్ కుటుంబం చూస్తుంది.
డివిజన్ పరిధిలోని KK6, శ్రావణపల్లి ఓసి లను వేలానికి పెట్టింది. ఈ రెండు మైన్స్ ని వేలానికి వేసి తన కంపెనీకి అప్పజెప్పాలని కుట్ర చేస్తున్నాడు.
కాంగ్రెస్ కు వేసే ఓటు సింగరేణి సంస్థను ముంచడానికే అన్నారు. కార్మికుల తరఫున గొంతునై నినదిస్తా, ఏజెంటుగా సేవ చేస్తా దయచేసి కార్మికులందరూ సంఘాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించాలి అని బాల్క సుమన్ కొరారు.
మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను మారుస్తుందని, రాయి ఏదో.. రత్నం ఏదో ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు.మంచి పార్టీకి ఓటు వేస్తే.. అంతా మంచే జరుగుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ, ఒక్క వైద్య కళాశాల కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. జిల్లాకో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని చట్టంలో ఉన్నా.. కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలిన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు వచ్చే నిధుల్లో రూ.25వేల కోట్లు కేంద్రం కోత పెట్టిందన్నారు. రైతు బంధు రూ.16వేలు రావాలంటే హుజూరాబాద్లో కౌశిక్రెడ్డిని గెలిపించాలన్నారు. గతంలో నన్ను ఒకసారి బాధ పెట్టారు. ఈసారి అలా జరగొద్దన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. కౌశిక్రెడ్డికి ఓటు వేయండి.. హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలను మరోసారి గెలుచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, కోరుట్ల నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్లో నాలుగో సారి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రెండో విడతలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభలకు భారీ జన సమీకరణతో విజయవంతం చేయడం ద్వారా పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలోనే ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. గంగాధర మండలం పత్తికుంటపల్లిలో చొప్పదండి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ, హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ప్రజా ఆశీర్వాద సభలకు కూడా భారీ జనసమీకరణ చేస్తున్నారు. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఆశీర్వాద సభలతో పార్టీశ్రేణులు, ప్రజల్లో గెలుపు ఖాయమనే మెస్సేజీ తెచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు.
సీఎం పర్యటన వివరాలు
- శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్నుంచి సీఎం కేసీఆర్ బయలు దేరి 12.50కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 12.55కు హెలిక్యాప్టర్లో బయలుదేరి కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ హెలీప్యాడ్ గ్రౌండ్కు 1.30కి చేరుకుంటారు. అనంతరం ఎస్సారార్ కళాశాల మైదానానికి చేరుకుని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
- 2.35కు అక్కడి నుంచి బయలు దేరి గంగాధర మండలం పత్తికుంట గ్రామానికి 2.40కి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.
- 3.20కు అక్కడి నుంచి జమ్మికుంటకు 3.50 నిమిషాలకు చేరుకుని సభలో ప్రసంగిస్తారు.
- 4.30కు హన్మకొండ జిల్లా పరకాలకు బయలుదేరుతారు.
- సీఎం పర్యటన సందర్భంగా ఎస్సారార్ కళాశాల మైదానం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read Also..
సీఎం కేసీఆర్ బహిరంగ సభలో బుల్లెట్ల కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం కొనసాగుతుండగా అస్లాం అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ హల్చల్ చేశాడు. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Read Also..
Read Also..
తాము మూడేళ్లు ఆలోచించి ధరణిని తీసుకువచ్చామని, అలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తుందని, ఈ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చెప్పారని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం అదిలాబాద్లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుబంధుతో డబ్బులు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతుబంధును విడతలవారీగా ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఈ నెల 19న తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఏస్ అధినేత కేసిఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ తెలిపారు.. ఈ రోజు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 19న ఆదివారం లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాలు, రెండు మున్సిపాలిటీ లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కెసిఆర్ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also..
ఆనాడు చెరువు ఎండిన నాడు టిఆర్ఎస్ పార్టీ మీతోనే ఉన్నది ఇవాళ చెరువు నిండిన నాడు కూడా బీఆర్ఎస్ పెట్టి మీతోనే ఉన్నదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని బండాలింగాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంజయ్ తో కలిసి ప్రచారం లో భాగంగా ఆమె మాట్లాడుతూ మరి ఎందుకు కేసీఆర్ కు ఓటు వేయాలి అని చాలామంది మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు బండాలింగాపూర్ లోని పెద్ద చెరువు ఎలా ఉండేదని ఇవాళ ఎలా ఉందని , చెరువులు ఎండిపోయినప్పుడు కప్పలన్నీ చెరువును విడిచిపెట్టి కానీ చెరువులో చేప పిల్లలు ఉంటే చెరువు నిండిన ఎండిన అదే చెరువులో ఉంటాయని బ్రతికిన బ్రతుకుతాయి చచ్చిన చస్తాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం చేపలాంటోల్లమని, కప్పలాంటి వాళ్లు కాంగ్రెస్ బిజెపి పార్టీ వాళ్ళని, కవిత అన్నారు. ప్రజలను ఒకటే కోరుతున్న మంచి నాయకుడు సంజయ్ అన్న మీరు కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు.





Total views : 90766