తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని యువత భావిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యారు. నిరుద్యోగ యాత్ర పేరుతో యువత రాష్ట్రమంతటా పర్యటించి తెలంగాణా రాక ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణా వచ్చిందే నీళ్లు, నియామకాల కోసమని, కానీ గులాబీ బాస్ ఆ రెండింటిని పూర్తిగా పక్కనపెట్టారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యలో నేటి నుంచి 26వ తేదీ వరకు నిరుద్యోగులు బస్సు యాత్ర చేయాలని తలపెట్టారు. హైదరాబాద్ గన్ పార్క్ నుంచి ప్రారంభమైన యాత్రను ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పది సంవత్సరాల్లో కెసిఆర్ సర్కార్ ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా చేయలేదని మండిపడ్డారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగ నియామకాలు జరిపినా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది మహిళలు, యువత కారణంగా అధికారంలోకి వస్తాయని చెప్పవచ్చు. కానీ కెసిఆర్ సర్కార్ యువత ఆశలను ఆడియాసలు చేయడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. వీరందరూ మూకుమ్మడిగా గ్రామాల్లో పర్యటించి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ ప్రభావం తప్పకుండా కెసిఆర్ పై పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Kcr
సనత్ నగర్ నియోజకవరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ నీలిమ ఇంటింటి ప్రచారం బన్సిలాల్ పేట్ డివిజన్ లోని బలరాం కాంపౌండ్, పద్మారావు నగర్ హమాలి బస్తీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా నీలిమ మాట్లాడుతూ… నగరంలో అభివృద్ధి జరుగుతుంటే పద్మరావు నగర్ లో రోడ్లు, హమాలీ బస్తీ ఎందుకు అంత అధ్వనంగా ఉందని ప్రశ్నించారు. తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ సాధించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు.
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలో లేనని వ్యాఖ్యానించారు. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ తనను చాపను రాకినట్టు రాకాడని, అయినా ఇప్పుడు కొన ఊపిరితో కొట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనన్నారు. తన వెంట ఉన్నది ధైర్యలక్ష్మి మాత్రమే అన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి 3 వేలు ఇస్తే తీసుకోవాలని, కానీ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా శక్తి, ధైర్యం అంతా హుజూరాబాద్ ప్రజలే అని ఈటల అన్నారు.
మెదక్ నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. 50ఏళ్లు కాంగ్రెస్ పాలించినా నీళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ భయంకరమైన పరిస్థితులు వస్తాయని తెలిపారు. రైతుబంధును పుట్టించిందే బీఆర్ఎస్ అని రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలంటున్నారన్నారు. ఇక రైతుబంధు ఉండాలా? వాద్దా ? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని ధరణి పోతే దళారులు, పైరవీకారులు వస్తారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావోద్దని గత ప్రభుత్వ వైఖరి, ఈ ప్రభుత్వ వైఖరేంటో ఆలోచించి ఓటేయండని సూచించారు.
intuc కాంపల్లి సమ్మయ్య- సింగరేణి నష్టాల బాటలో పయనించేలా చేసింది కెసిఆర్…
మంచిర్యాల జిల్లా మందమర్రి
సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయుటకు బిజెపితో చేతులు కలిపి టిఆర్ఎస్ నీ బిఆర్ఎస్ గా మార్చి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బతీసిందని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం కోన సాగిస్తున్నామని బుధవారం మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో intuc నాయకులు కాంపల్లి సమ్మయ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. తెలంగాణ వస్తే మన పరిపాలన మనమే చేసుకుంటాం మన నిధులు ఉద్యోగాలు మనకే వస్తాయి అని చెప్పిన టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ గా మార్చి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. సింగరేణిలో బొగ్గు గని కార్మిక సంఘం గెలిస్తే సింగరేణి కార్మికుల ఇళ్లను దివ్య కాంతులుగా వెలిగిస్తాం సింగరేణి కార్మికుల కుటుంబల పిల్లల భవిష్యత్తును మారుస్తానని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదని సింగరేణి ఆదాయాన్ని రెండువేల కోట్లు వాడుకొని సింగరేణి నష్టాల బాటలో పయనించేలా కెసిఆర్ చేశారని మండిపడ్డారు అక్కడ కెసిఆర్ ఇక్కడున్నటువంటి బాల్క సుమన్ ని ఇంటికి పంపించేదాకా ఊరుకునేది లేదని ముక్తకంఠంతోని నినాదం చేస్తూ ప్రజలు ఏకమై వస్తున్నార ఎక్కడ కూడా దందాలు చేసి డబ్బులు సంపాదించలేదు ప్రజలకు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన వారు ముందుండి సమస్యను తీరుస్తారని సూచించారు.వీరిద్దరు స్థానికులే గత 50 సంవత్సరాల నుండి కాక వెంకటస్వామి చెన్నూర్ని అదేవిధంగా పెద్దపెల్లి పార్లమెంటు సభ్యునిగా ఉండి అభివృద్ధి పదంలో నడిపించారానారు. అదేవిధంగా వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ ను తీసుకొచిన్న ఘనత వారిది నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇసుక బొగ్గు బు దండాలు పాల్పడుతున్నారని కోట్లు సంపాదించిన వ్యక్తి కి ప్రజలు బుద్ది చేపి తరిమివేయాలని ఎన్నికలలో కాంగ్రెస్ కు అభ్యర్థి వివేక్ భారీ మెజార్టీ తో గెలిపించలని ఐఎన్టీయూసీ యూనియన్ కోరారు .
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలో లేనని వ్యాఖ్యానించారు. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ తనను చాపను రాకినట్టు రాకాడని, అయినా ఇప్పుడు కొన ఊపిరితో కొట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనన్నారు. తన వెంట ఉన్నది ధైర్యలక్ష్మి మాత్రమే అన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి 3 వేలు ఇస్తే తీసుకోవాలని, కానీ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా శక్తి, ధైర్యం అంతా హుజూరాబాద్ ప్రజలే అని ఈటల అన్నారు.
రాష్టంలో సీఎం కేసీఆర్ ను మ్యాచ్ చేసే లీడర్ లేడని, దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారన్నారు హరీష్ రావ్. మంత్రి హరీశ్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్య అంటే చాలా మంది స్కూళ్లు, విద్యా శాఖ బడ్జెట్ మాత్రమే చూస్తారు కానీ.. వైద్య శాఖ ద్వారా మెడికల్ కాలేజీలు, ఫారెస్ట్ యూనివర్సిటీ, హర్టికల్ యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ వంటివి కూడా విద్య కు చేసే ఖర్చుగా చూడాలి అన్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేశామని, అన్నిస్థాయిల దవాఖానాల్లో సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చామని, మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య,విద్యా రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావ్.
Read Also..
ప్రజలు గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి జాజుల సురేందర్ను ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి పరిణితి ఇంకా రాలేదన్నారు. ఏ దేశాల్లో అయితే వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయన్నారు. ఎలక్షన్లు చాలా వచ్చాయి. పోయాయని ఇది మామూలుగా జరిగే విషయమేనన్నారు. అది కాకుండా రెండు విషయాలపై ప్రజలు గట్టిగా నిర్ణయిస్తే. చాలా మంచి జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థి గుణం, గణం మంచీ చెడు, వ్యక్తిత్వంపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ఏక పార్టీ ప్రభుత్వం రాదని తెలిపారు. అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే బీఆర్ఎస్ తడాఖా అప్పుడు ఢిల్లీలో చూపెడుదామని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నామని… హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతున్నామని ఈ నేపథ్యంలో ఆయన తెలిపారు. ప్రతి స్కీంలో అందరం భాగస్వామ్యం అవుతున్నామని అందరం సోదరుల్లా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఉదాహరణగా ఉంటున్నామన్నారు. పదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదన్నారు కేసీఆర్. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటెన్ చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Also..
Read Also..
మెదక్ జిల్లా లో ఈనెల 16 న నర్సాపూర్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. హెలిప్యాడ్, సభ వేదిక, సభా ప్రాంగణం ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించిన మంత్రి హరీశ్ రావు సూచించారు.





Total views : 90766