నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠా అరెస్ట్. అంతరాష్ట్ర డ్రగ్స్ ను అరెస్ట్ చేసిన రాచకొండ SOT పోలీసులు అరెస్ట్ చేసారు. రాజస్థాన్ నుండి తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తున్నారు. ఓపియం డ్రగ్ 3.4 కేజీలు , 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాదినం చేసుకున్నాం. 2.8 లక్షలు నగదు సీజ్ చేసాం. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన SOT పోలీసులు అరెస్ట్ చేసారు. శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ బాయ్ లను అరెస్ట్ చేసాం. శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. బస్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెస్తున్నారు. డ్రగ్స్ ను నిర్ములించడానికి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నాం.
latest news
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటగా చిట్యాలకు వచ్చిన సినిమాటోగ్రఫీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి గజమాలతో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. చిట్యాల సెంటర్ లో మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసిన మంత్రి వెంకట్ రెడ్డి.
మంత్రి వెంకట్ రెడ్డి కామెంట్స్:
- కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో నకిరేకల్ లో గెలిపించి వేరేశం ను ఎమ్మెల్యే గా చేసినందుకు మీకు ధన్యవాదాలు.
- చిట్యాలలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణంకి జనవరి 2న టెండర్ స్టార్ట్ చేసి సంక్రాంతికి శంకుస్థాపన చేద్దాం.
- చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని హామీ.
- చిట్యాల మున్సిపాలిటీ కి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తా.
- గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ లే ఉన్నాయి. అప్పుడు ఎలాగైతే రెట్టింపు వేగంతో పనిచేసామ్మో అంతకంటే ఎక్కువ రెట్టింపుతో పని చేసి నకిరేకల్ నియోజకవర్గంని అభివృద్ధి చేసుకుందాం.
తిరుపతి, ఆర్డీవో సుజనా, మున్సిపల్ కమిషనర్ కే ఎల్ ఎన్ రెడ్డిఆధ్వర్యంలో పుత్తూరు పట్టణంలో ఓటు హక్కు పై అవగాహన, ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి ఆర్డీవో సృజన పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. కుల, మత, లింగ, జాతి, భాష, అనే బేధం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాల నిండిన పౌరులందరికీ ఓటు వేసే బాధ్యత, హక్కు,భారత రాజ్యాంగం ఆర్టికల్ 320 ద్వారా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాలలో బంధు నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతని ఇవ్వాలని కోరారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంలో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం లో వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఆటో కార్మికులు.
సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఓసిపి త్రీ కృషి భవన్ లో ఐఎన్ టియూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థ ను అప్పుల పాలు చేసిందని, రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చారాని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే కార్మికుల సొంతింటి కల అమలు కోసం కృషి చేస్తామని, కోల్ బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా రేణిగుంట, రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం బెంగళూరు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం వారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కి తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిధి గృహం వద్ద స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్.
యాదాద్రి భువన గిరి జిల్లా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయి 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మరోసారి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా నిరూపితమైంది. డిసెంబర్ 3న నిజమైన తెలంగాణ సిద్ధించింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం. నల్గొండ అభివృద్ధి మా లక్ష్యం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము.
నేడు నల్గొండ జిల్లాకు రానున్న రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. ఉదయం 10.30 కి మర్రి గూడ బై పాస్ నుంచి నల్గొండ లోని మంత్రి నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ. నల్గొండ పట్టణంలోని మంత్రి నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం, ప్రజలను కలుసుకోనున్న మంత్రి. గత యేడాదిగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ల తీరు.. భవిష్యత్ లో అనుసరించాల్సిన విధానం, జిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి కల్పన, జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాలో ఎదరవుతున్న సమస్యలు.. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఇతర విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్. అనంతరం జిల్లా అధికారులతో ఇష్టాగోష్టి.
గుంటూరు. తాడేపల్లి సీఎం కాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మద్దాల గిరి కి పిలుపు. సోమ ,మంగల వారాల్లో మధ్యాహ్నం తరువాత వచ్చి కలవాలని ఆదేశం. ఇటీవల గుంటూరు ప్రశ్చిమ నియోజక వర్గ ఇంచార్జి మార్పు పై ఆర్య వైశ్యులు ఆందోళన చేసిన వైనం. ఇంచార్జి మంత్రి రజినీ నియోజక వర్గంలో పర్యటన చేస్తే అసంతృప్తులు ఉంటాయని అంచనా. ఇప్పటికే మంత్రి రజినీ నియోజక వర్గంలో కీలక వైసీపీ నేతలతో భేటీ, తనకి మద్దతు ఇవ్వాలని కోరిన మంత్రి రజినీ. చిలకలురి పేటలో మంత్రి రజనీ మర్రి రాజశేఖర్ మధ్య విభేదాలు ఉండటంతో గుంటూరు ప్రశ్చిమ నియోజకవర్గం కి మకాం మార్చిన రజినీ అంటున్న వైసీపీ నేతలు. మంత్రి రజినికి మద్దతు ఇవ్వాలని మద్దాల గిరి ని బుజ్జగించే అవకాశం.
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సోమవారం నాడు భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా లఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధాలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. వందలాది మంది భక్తులు బద్దిపోచమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.




Total views : 202844