ఏపీ సీఎం జగన్పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే.. ఏపీలో జగన్ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజానీకానికి భాజపా వ్యతిరేకంగా ఉందని.. అయితే, ఆ పార్టీకి అనుకూలంగా జగన్ ఉన్నారని మండిపడ్డారు. ఏపీలోనూ అధికార మార్పిడి ఖాయమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీచేస్తామని నారాయణ ప్రకటించారు.
latest news
తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, బాలుడి కిడ్నాప్ ఆపై దారుణ హత్య, ఈ వార్త విని ఉలిక్కిపడ్డ వరదయ్యపాలెం,బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ప్రజలు, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్(8) బాలుడిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన రేఖా అనే మహిళ. బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని హత్య చేసి చెట్ల పొదల్లో మూటగట్టి పడవేసిన పరారైన మహిళ రేఖ. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు తరలించిన తమిళనాడు పోలీసులు. వరదయ్యపాలెం మండలంలోని కాంభాకం లోని ఓ వ్యక్తి సహాయంతో ఈ దారుణానికి పాల్పడిన రేఖ. వరదయ్యపాలెం మరియు బుచ్చినాయుడు కండ్రిగ మండలాల పోలీసుల సాయం తీసుకొని కేసును చేదించిన తమిళనాడు పోలీసులు.
హైదరాబాద్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్ డే కోసం సంపత్ అనే వ్యక్తి గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడు. కాగా.. 30 మంది కోసం ప్రేమ్ చంద్ డ్రగ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లతో కలిపి పార్టీ అరెంజ్ చేశాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 20న అసెంబ్లీ సమావేశంఉండటంతో మంగళవారం రాత్రికే సీఎం రేవంత్ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుసృత్తవ్యాఖ్యలు చేసిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ,దత్త పుత్రుడుకు బుద్ధిచెప్పతారు. సుబ్రహ్మణ్యేర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు ప్రారంభించిన
మంత్రి,కోట్టు సత్యనారాయణ. మెపిదేవి దేవి లో కోలువైయిన్న శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి అంగరంగవైభవంగా ప్రారంభయిన్నాయి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కోటి సత్యనారాయణకుంటబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ,స్వామిపుట్టలో పాలుపోసి, అనతరం ప్రతేకపూజలు నిర్వహించారు. తొలియత దేవాలయం అధికారులు, అర్చకులు బృందం అలయమర్యదులతో స్వాగతం పలికారు. అనతరం మంత్రి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై త్రీవరస్థాయిలో మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ కి రైతుల వద్ద తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అంజనాపురం గ్రామం లోని గిరిజన రైతుల వద్ద తీసుకున్న భూములకు 30 లక్షలు ఇస్తామని చెప్పి 20 లక్షల రూపాయలే రైతుల ఎకౌంట్లో జమ చేశారని మిగతా నగదును రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ ఆర్డీవో సైతం రైతులు దగ్గర తీసుకున్న భూములకు న్యాయమైన రేటును ప్రకటిస్తామని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్య వద్ద ఎకరానికి 27 లక్షల రూపాయలు చొప్పున నగదు తీసుకొని రైతుల ఎకౌంట్లో 20 లక్షలు రూపాయలు జమ చేశారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మా ప్రాంతంలో ఎకరం 50 లక్షలు వరకు డిమాండ్ ఉందని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తమ భూములను ఇచ్చామని తమకు న్యాయమైన రేటు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు తమకు నష్టపరిహారం చెల్లించేంతవరకు ఫ్యాక్టరీ పనులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు స్థానికులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతల బరితెగింపు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూములు ఆక్రమిస్తున్న వైసీపీ నాయకులు. చర్చి భూమిని కాజేసేందుకు యత్నం అడ్డుపడ్డ సంఘస్తుల పై దాడి. రెండు కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వైసిపి నాయకులు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి లూధరన్ చర్చి కి సంబంధించిన 2 ఎకరాల70 సెంట్ల భూమి ని వైసీపీ నేత దాచేపల్లి నగర పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ అంజమ్మ భర్త వేల్పుల ధర్మదేవ్, అతని అన్న కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి వేల్పుల కిషోర్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసారు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలం లోకి jcb తో అక్రమించగా చర్చి సంఘ పెద్దల ఇదేమిటి ఇది బ్రిటీష్ వారు మా చర్చికి ఇచ్చారు ఇది మా సంఘం కి సంబంధించిన స్థలం మీరెవరూ అని ప్రస్నించగా ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి కిషోర్ సంఘ పెద్దల పై దాడి చేసి బలంగా కడుపులో పిడికిలితో గుద్దడంతో సంఘ పెద్దలు అందరూ కలసి దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసేందుకు వెళ్లారు కాని పోలీసులు కూడా మీరు ఎందుకు వెళ్లారు మీకు ఏమి సంబందం అని వైసీపీ నేతలకు వత్తాసు పలికారు సదరు విషయం పై సోమవారం జిల్లా కలెక్టర్ కి,యస్పీ కి స్పందనాలో పిర్యాదు చేయాలని సంఘస్తులు నిర్ణయం తీసుకున్నారు.
సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలు దొంగలించి లారీలో వేసుకొని వెళ్తుండగా సినీ పక్కిలో వారిని వెంబడించి దాడులు నిర్వహించి దాదాపు లారీ తో సహా నాలుగు టన్నుల పైబడి ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు, సత్యవేడు సిఐ సర్కిల్ కి చెందిన స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం గోడౌన్లో కాపలా దారులను బెదిరించి వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడ్డ ఎర్రచందనం దొంగలు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు ఈ గోడౌన్ పై దాడులు చేస్తారని ఖచ్చితమైన సమాచారంతో వారం రోజులుగా టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పచెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది సింగరేణి ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలను డిసెంబర్ 27 కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలను నిర్వహిస్తామని గతంలో చెప్పారని కోర్టు గుర్తుచేసింది. అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి సమయం కావాలని కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు మొదటి నుంచి అవాంతరాలు, ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చేముందు ఒకసారి గుర్తింపు కార్మిక సంఘం,ఆతర్వాత యాజమాన్యం, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వేరు వేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి. చివరికి అక్టోబర్ లో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. ఈ నెల 21 న కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయం సందిగ్ధత నెలకొంది.




Total views : 202964