మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. భూమిలోని పొరల్లో ఏదైనా మార్పులు సంభవించి ఉండవచ్చునని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని బాధితుడు కోరారు..
latest news
ఏలూరు జిల్లా, దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నరు. ఉదయం 9.35 గంటలకు విజయవాడ రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10.50 గంటలకు గాలాయిగూడెం చేరుకోనున్న గవర్నర్. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.40 వరకు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నర్. మధ్యాహ్నం 12.45 గంటలకు గాలాయిగూడెం నుండి రోడ్డు మార్గంలో విజయవాడ రాజ్ భవన్ కు వెళ్లనున్న గవర్నర్.
అమరావతి, భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ. 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, విజయవాడ. తుఫాను హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కు కిసాన్ మోర్చా పిలుపు. వరిచేల వద్దకు వచ్చి నష్టం అంచనాలు వేయాలి. రైతు వద్ద కు ప్రతి వడ్ల గింజ కొనాలని కోరుతూ 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ధర్నాలకు దిగనున్నామని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి వెల్లడించారు. కౌలు రైతుల ను ఆదుకోవడం తో పాటు రెండు రోజుల్లో రైతు లు వద్ద తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కుమార స్వామి డిమాండ్ చేశారు. పంట నష్టం ప్రాధమిక నివేదిక కేంద్రానికి అందచేయని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. వేలకోట్ల రూపాయలు పంటనష్టం జరిగితే అంచనాలు రూపొందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దిశలో ఉంది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. తడిచిన ధాన్యం అయినకాడికి అమ్ముకొంటున్న రైతులు – చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించాలి. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఉదారంగా చెల్లించాలి. పత్తి, మిరప, పొగాకు, అరటి, పసుపు పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలి. ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయల సాయం అందించాలి. డ్రైనేజ్ , ఇరిగేషన్ కాలువలను వెంటనే ఆధునీకరించాలి. పంట కోల్పోయిన రైతుల పంటరుణాలను మాఫీ చేయాలి. ఎరువులు, విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలి. ప్రతి రైతుకు పంటల బీమా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కుమార స్వామి డిమాండ్ చేశారు, కిసాన్ మోర్చా ఆందోళన కు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
చిత్తూరు జిల్లా వి.కోట, పలమనేరు నియోజకవర్గములోని వి.కోట మండలంలో 14 ఏనుగుల గుంపు హల్చల్. నిన్న రాత్రి సుమారు 7 గంటల నుంచి పంట పొలాలపై స్వైర విహారం చేసిన ఏనుగుల గుంపు. ఉదయం తిరిగి అడవిలోకి వెళ్లిన ఏనుగులు. అటవీశాఖ అధికారులు ఏనుగుల మందను తరిమే ప్రయత్నంలో విఫలం అయ్యారు. గత రెండు రోజులుగా పంట పొలాలను తొక్కి ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు. పలు గ్రామాల్లో అరటి,రాగి,టమోటా పంటలు పూర్తిగా ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు. వి.కోట మండలం వెర్రినాగేపల్లి గ్రామంలో వరి..అరటి..బీన్స్..మామిడి..తోటలపై ఏనుగులు దాడి సుమారు పది లక్షల ఆస్తి నష్టం. ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదని రైతుల ఆందోళన.
హైదరాబాద్, డిసెంబర్ 11 రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి,వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవీ గుప్తా, ఇంటలీజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్బంగా సి.ఎం. మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు . ఈ విభాగానికి కావాల్సిన నిధులు,వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సయిజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పై కార్యాచరణ ప్రారంబించాలి. ప్రతీ మంగళవారం ,శుక్రవారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్న 01 వరకు ప్రజా వాణి నిర్వహించాలి. ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాదర్బార్ ను ఇక నుంచి ప్రజావాణి గా పిలవాలని ఆదేశం. ప్రజావాణి లో వికలాంగులు ,మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలి.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలు సమాచారం తో ఎస్ ఇ బి అధికారులు దాడి. పుదుచ్చేరి యానాం నుండి అక్రమంగా మద్యం తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని,269 ఎన్.డి.పి.ఎల్. మద్యం సీసాలు,51బీర్లు స్వాదీనం చేసుకున్న అధికారులు..
పండ్లు అనేవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అవి విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలాలు. పండ్లను తినడం వల్ల మన శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మనం ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉంటాము.
సీజనల్ పండ్ల రసాలను తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీజనల్ పండ్లు అంటే ఆ ప్రాంతంలో ఆ సమయంలో లభించే పండ్లు. సీజనల్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
సీజనల్ పండ్ల రసాలను తాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు:
- శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. సీజనల్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని రసాలుగా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా పొందవచ్చు.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ పండ్లలో ఉండే విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
- శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. పండ్ల రసాలు శరీరానికి అవసరమైన నీటిని అందిస్తాయి. వేసవిలో శరీరంలో నీరు హరించకుండా ఉండటానికి సీజనల్ పండ్ల రసాలు చాలా మంచివి.
- దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సీజనల్ పండ్ల రసాలు ఫ్లూరైడ్ను కలిగి ఉంటాయి. ఫ్లూరైడ్ దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సీజనల్ పండ్ల రసాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
సీజనల్ పండ్ల రసాలను తాగడానికి కొన్ని చిట్కాలు:
- రసాలు తయారు చేసేటప్పుడు పండ్లను మెత్తగా చేసి తాగడం మంచిది.
- రసాలలో చక్కెర లేదా ఇతర రుచులను జోడించకుండా ఉండటం మంచిది.
- రసాలను నిల్వ చేయకుండా తాగడం మంచిది.
సీజనల్ పండ్ల రసాలు చాలా ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, సీజనల్ పండ్ల రసాలను తీసుకోవడం మంచి ఆలోచన.
పవిత్ర కార్తీక మాసోత్సవాలు చివరి దశకు, చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణలతో మారుమోగాయి. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దేవాలయాలకు చేరుకోగా, వేద పండితులు స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దేవస్థాన ప్రాంగణంలో స్వామివారికి కార్తీకదీప పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో కార్తీక మాసోత్సవ వేడుకలు విజయవంతంగా ముగుస్తున్నాయని దేవదాయ శాఖ అధికారి నటరాజన్ షణ్ముగం అన్నారు.






Total views : 200828