గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక వైసిపి ముఖ్య నేత బినామీల పేర్లతో అక్రమ కట్టడాలకు తెర లేపారు. కూటమి ప్రభుత్వం రావడంతో నగరపాలక సంస్థ అధికారులు కట్టడాలు కూల్చివేయడం మొదలుపెట్టారు. హైడ్రా తరహాలో నగరపాలక సంస్థ అధికారులు అనధికార కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని లక్ష్మీ సెలబ్రేషన్స్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఖలీల్ రెండు సంవత్సరాల క్రితం దాదాపు కోటి రూపాయలతో అక్రమ కట్టడం నిర్మించి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఖలీల్ కు మేయర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు
పేరుకు మాత్రం నామమాత్రపు నోటీసులు జారీ చేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆ అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కమిషనర్ పులి శ్రీనివాసులను నగరవాసులు అభినందిస్తున్నారు. ఇలాంటి అనధికారిక కట్టడాలు ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిపై కూడా అధికారులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.తెలంగాణ ప్రభుత్వం భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువల సవరణకు ఆమోదం తెలిపింది. కొత్త మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ల ధోరణి, డిమాండ్ వంటి అంశాలను…
- ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్రెడ్డి.ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ, రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో పలు ఎత్తిపోతల పథకాలు,…
- మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి.మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ లో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై కొందరు బ్లేడ్తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇందిరానగర్కు చెందిన మంద సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి ఓ వైన్స్లో మద్యం…
- గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్…
- నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.ప్రముఖ యూట్యూబర్ మన శంకర వర ప్రసాద్, నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మోసం కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ చేస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఓ బాధితుడికి రూ. 15 లక్షల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92164